IND vs NZ 2nd T20I: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. కీలక మార్పుతో బరిలోకి భారత్.. అక్షర్ ప్లేస్‌లో ఎవరంటే?

India Predicted XI for 2nd T20I Against New Zealand: రాంచీలో జరిగే రెండవ టీ20ఐ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. అయితే, జట్టు ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

IND vs NZ 2nd T20I: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. కీలక మార్పుతో బరిలోకి భారత్.. అక్షర్ ప్లేస్‌లో ఎవరంటే?
Ind Vs Nz 2nd T20i

Updated on: Jan 23, 2026 | 11:58 AM

India predicted XI for 2nd T20I against New Zealand: భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు రెండో టీ20ఐ మ్యాచ్ లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం రాయ్‌పూర్‌లో జరగనున్న రెండవ T20I మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు మరో విజయంపై కన్నేసింది. నాగ్‌పూర్‌లో జిరగిన తొలి మ్యాచ్ లో 48 పరుగుల తేడాతో గెలిచిన 5 టీ20ఐల సిరీస్‌ను ప్రారంభించింది. అభిషేక్ శర్మ 35 బంతుల్లో 84 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడగా, రింకు సింగ్ కేవలం 20 బంతుల్లో 44 పరుగులు చేసి చివరిలో దడదడలాడించాడు. అనంతరం శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అయితే, అక్షర్ పటేల్ క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వేలికి గాయమై న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మధ్యలో మైదానం వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

అక్షర్ గాయం గురించి బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే, రెండో మ్యాచ్ కు అక్షర్ దూరమైతే, స్పిన్ దాడిని పెంచడానికి కుల్దీప్ యాదవ్ అతని స్థానంలోకి వస్తాడని భావిస్తున్నారు.

అభిషేక్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నాడు. సంజు శాంసన్ మరోసారి అతనితో కలిసి బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. కానీ అతను టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉన్నాడనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్‌కు మరో అవకాశం లభించవచ్చు.

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 32 పరుగులు చేయడం ద్వారా ఫామ్‌ను కొంత వరకు తిరిగి పొందాడు. హార్దిక్ పాండ్యా, శివం దుబేలతో కలిసి అతను భారత క్రికెట్ జట్టుకు బలీయమైన మిడిల్ ఆర్డర్‌ను ఏర్పాటు చేస్తాడు.

అక్షర్ ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉన్నందున, రింకు మరోసారి ఫినిషర్ పాత్ర పోషించాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.

న్యూజిలాండ్‌తో జరిగే 2వ టీ20కి భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..