కొత్త చరిత్ర అడుగులు .. తొలి డేనైట్ టెస్టుకు రెడీ అవుతున్న భారత మహిళా జట్టు
Indian womens cricket: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత మహిళా జట్టు రెడీ అవుతోంది. అయితే ఈ సిరీస్లో ఓ డేనైట్ మ్యాచ్ కూడా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత మహిళా జట్టు రెడీ అవుతోంది. తొలి డేనైట్ టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది భారత మహిళా క్రికెట్ జట్టు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నామని తెలిపారు. మహిళల క్రికెట్ను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
మహిళల క్రికెట్ పట్ల మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో టీమ్ఇండియా మహిళలు తొలి పింక్ బాల్ టెస్టు ఆడబోతున్నారని తెలిపేందుకు సంతోషిస్తున్నా” అని జై షా ట్వీట్ చేశారు.
Taking forward our commitment towards women’s cricket, I am extremely pleased to announce that Team India @BCCIwomen will play in their first-ever pink ball day-night Test later this year in Australia.
— Jay Shah (@JayShah) May 20, 2021
ఏడేళ్ల తర్వాత ఇంగ్లాండ్లో టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత మహిళా జట్టు సిద్ధమైంది. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో పాల్గొననుంది. తర్వాత టీ20, వన్డే సిరీస్లూ జరగనున్నాయి. ఇంకా షెడ్యూల్ ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ మధ్యలో ఈ పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చివరసారిగా ఆసీస్తో 2006లో టెస్టు మ్యాచ్ ఆడారు టీమ్ఇండియా మహిళలు.
Extra Income in Lockdown: మీకు అదనపు ఆదాయం కావాలా..! ఇలా చేయండి..! ఇక డబ్బే.. డబ్బు..!