AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs ENGW: ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన స్మృతి మంధాన!

లార్డ్స్‌లో జరిగిన ఏకైక టెస్టు తొలి రోజు భారత మహిళలు అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) హాఫ్ సెంచరీలతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. ఇస్సీ వాంగ్, సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ పుంజుకున్నా, భారత బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు.

INDW vs ENGW: ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన స్మృతి మంధాన!
Smriti Mandhana
SN Pasha
|

Updated on: Jul 11, 2026 | 8:32 AM

Share

చారిత్రక మైదానం, క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్ తొలి రోజు భారత్ అమ్మాయిలు ఆకట్టుకున్నారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన బ్యాటింగ్‌తో 83 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (58), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరి పోరాటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మంధాన మంచి ఆరంభాన్ని అందించింది. చూడచక్కని షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 89 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఒక దశలో భారత్ 300కు పైగా స్కోరు చేసేలా కనిపించింది.

అయితే ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్ బౌలింగ్‌లో మంధాన ఎడ్జ్ ఇవ్వగా, వికెట్ కీపర్ అమీ జోన్స్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఆమె ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో లార్డ్స్‌లో టెస్టు సెంచరీ నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచే అరుదైన అవకాశం మంధానకు చేజారింది. టీ విరామానికి ముందు చివరి బంతికే ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన మ్యాడీ విలియర్స్ బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అవుటవడం భారత్‌కు మరో ఎదురుదెబ్బగా మారింది. అనంతరం ఇంగ్లండ్ స్పిన్నర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు తీసింది. మంధాన అవుటయ్యే సమయానికి 190/3తో బలంగా ఉన్న భారత్, చివర్లో కుప్పకూలి చివరి నాలుగు వికెట్లను కేవలం 11 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారత్ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ టెస్టు అనంతరం వీడ్కోలు పలకనున్న ఓపెనర్ టామీ బ్యూమాంట్‌ను ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ కేవలం రెండు పరుగులకే ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ కంటే 264 పరుగులు వెనుకబడి ఉండటంతో, రెండో రోజు ఆట ఇరు జట్లకు కీలకంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..
పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..