AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs ENGW: ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన స్మృతి మంధాన!

లార్డ్స్‌లో జరిగిన ఏకైక టెస్టు తొలి రోజు భారత మహిళలు అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) హాఫ్ సెంచరీలతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. ఇస్సీ వాంగ్, సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ పుంజుకున్నా, భారత బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు.

INDW vs ENGW: ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన స్మృతి మంధాన!
Smriti Mandhana
SN Pasha
|

Updated on: Jul 11, 2026 | 8:32 AM

Share

చారిత్రక మైదానం, క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్ తొలి రోజు భారత్ అమ్మాయిలు ఆకట్టుకున్నారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన బ్యాటింగ్‌తో 83 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (58), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరి పోరాటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మంధాన మంచి ఆరంభాన్ని అందించింది. చూడచక్కని షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 89 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఒక దశలో భారత్ 300కు పైగా స్కోరు చేసేలా కనిపించింది.

అయితే ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్ బౌలింగ్‌లో మంధాన ఎడ్జ్ ఇవ్వగా, వికెట్ కీపర్ అమీ జోన్స్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఆమె ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో లార్డ్స్‌లో టెస్టు సెంచరీ నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచే అరుదైన అవకాశం మంధానకు చేజారింది. టీ విరామానికి ముందు చివరి బంతికే ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన మ్యాడీ విలియర్స్ బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అవుటవడం భారత్‌కు మరో ఎదురుదెబ్బగా మారింది. అనంతరం ఇంగ్లండ్ స్పిన్నర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు తీసింది. మంధాన అవుటయ్యే సమయానికి 190/3తో బలంగా ఉన్న భారత్, చివర్లో కుప్పకూలి చివరి నాలుగు వికెట్లను కేవలం 11 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారత్ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ టెస్టు అనంతరం వీడ్కోలు పలకనున్న ఓపెనర్ టామీ బ్యూమాంట్‌ను ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ కేవలం రెండు పరుగులకే ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ కంటే 264 పరుగులు వెనుకబడి ఉండటంతో, రెండో రోజు ఆట ఇరు జట్లకు కీలకంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యూబ్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూబ్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి
40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి