ప్రపంచకప్లో భాగంగా భారత్ మరో పోరుకు సిద్ధమైంది. బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన టీమిండియా.. ఇప్పుడు చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోతున్న బంగ్లాతో తలపడుతోంది. బంగ్లాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో ఇంగ్లండ్ను ఛేజింగ్లో ఓడించడంలో చతికలపడిన టీమిండియా ఈ మ్యాచ్లో వ్యూహం మార్చింది. భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు. కేదార్ జాదవ్ స్థానంలో దినేష్ కార్తీక్కు అవకాశం దక్కింది. కుల్దీప్ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్ ఈ మ్యాచ్లో ఆడబోతున్నాడు. జడేజా కూడా ఈ మ్యాచ్లో ఆడటం లేదు. బంగ్లాదేశ్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లను మార్చారు. సెమీస్కు ఒక్క అడుగు దూరంలో ఉన్న కోహ్లీసేన బంగ్లాపై గెలుపుతో బెర్తు ఖాయం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే 13 పాయింట్లతో ఇండియా నేరుగా సెమీస్కు దూసుకెళ్తుంది.