AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : 33 ఫోర్లు, 15 సిక్సర్లు.. 404 పరుగుల సునామీ.. ఆసియా కప్‌లో ఇండియాదే డామినేషన్

2025 ఆసియా కప్‌లో అసలైన థ్రిల్లర్ మ్యాచ్ ఇదే. సూపర్-4లో భాగంగా జరిగిన చివరి పోరులో భారత్-శ్రీలంక జట్లు 20 ఓవర్లలో సరిగ్గా 202 పరుగులు చేసి టైగా నిలిచాయి. చివరకు సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ ఉత్కంఠలో టీమిండియా అజేయంగా నిలిచి, అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Asia Cup 2025 : 33 ఫోర్లు, 15 సిక్సర్లు.. 404 పరుగుల సునామీ.. ఆసియా కప్‌లో ఇండియాదే డామినేషన్
India Vs Sri Lanka
Rakesh
|

Updated on: Sep 27, 2025 | 7:28 AM

Share

Asia Cup 2025 : ఆసియా కప్‌లో టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. సూపర్-4లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను సూపర్ ఓవర్‌లో ఓడించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా శ్రీలంక జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేయగలిగింది. శ్రీలంక తరపున పతుమ్ నిస్సాంక కేవలం 58 బంతుల్లో 107 పరుగులతో సెంచరీతో అదరగొట్టినా, అతని ప్రయత్నం వృథా అయ్యింది. మ్యాచ్ టై అవడంతో, 2025 ఆసియా కప్‌లో తొలిసారిగా సూపర్ ఓవర్ ఆడారు.

ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు చివరి బంతి వరకు ఉత్కంఠను పంచింది. ఈ గెలుపుతో 2025 ఆసియా కప్‌లో టీమిండియా అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత్ తరపున అభిషేక్ శర్మ 31 బంతుల్లో 61 పరుగులు, సంజు శాంసన్ 23 బంతుల్లో 39 పరుగులు, తిలక్ వర్మ 34 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించారు. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కూడా ఆఖరి బంతి వరకు పోరాడి, 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ పతుమ్ నిస్సాంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, కేవలం 58 బంతుల్లో 107 పరుగులతో సెంచరీ సాధించాడు. అయితే, అతని సెంచరీ జట్టును గెలిపించలేకపోయింది. మ్యాచ్ టై కావడంతో, విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఇది 2025 ఆసియా కప్‌లో ఆడిన మొట్టమొదటి సూపర్ ఓవర్!

సూపర్ ఓవర్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. భారత్ తరపున యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. శ్రీలంక తరపున కుసల్ పెరీరా, దుసన్ శనక బ్యాటింగ్‌కు దిగారు. అయితే, సెంచరీ హీరో పతుమ్ నిస్సాంకను సూపర్ ఓవర్ ఆడటానికి పంపకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అర్ష్‌దీప్ సింగ్ తన మొదటి బంతికే కుసల్ పెరీరాను అవుట్ చేసి శ్రీలంకకు షాక్ ఇచ్చాడు. రెండవ బంతికి ఒక పరుగు రాగా, మూడవ బంతి డాట్ అయ్యింది. నాలుగవ బంతికి శ్రీలంక రెండవ, చివరి వికెట్‌ను కోల్పోవడంతో, కేవలం రెండు పరుగులకే వారి సూపర్ ఓవర్ ముగిసింది.

ఆ తర్వాత, భారత్ తరపున కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్ బ్యాటింగ్‌కు వచ్చారు. శ్రీలంక తరపున వనిందు హసరంగా బౌలింగ్ చేశాడు. భారత్ తొలి బంతికే మూడు పరుగులు తీసి మ్యాచ్‌ను గెలుచుకుంది. సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ షాట్ ఆడటంతో, భారత్ సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఆసియా కప్ 2025లో తమ అజేయ రికార్డును కొనసాగించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..