Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Martin Guptill: అశ్విన్ బౌలింగ్ ఎదుర్కొవడం కష్టం.. అతడు వేసే బంతులు వైవిధ్యంగా ఉంటాయి..

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లైన్ అండ్ లెంగ్త్‌, పేస్ వైవిధ్యంతో బౌలింగ్ చేస్తాడని, అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అన్నాడు. అతడు చాలా కచ్చితత్వంతో బంతులేస్తాడని, వాటిని అంచనా వేయడం కష్టమని చెప్పాడు....

Martin Guptill: అశ్విన్ బౌలింగ్ ఎదుర్కొవడం కష్టం.. అతడు వేసే బంతులు వైవిధ్యంగా ఉంటాయి..
Ashwin
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 19, 2021 | 8:37 AM

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లైన్ అండ్ లెంగ్త్‌, పేస్ వైవిధ్యంతో బౌలింగ్ చేస్తాడని, అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అన్నాడు. అతడు చాలా కచ్చితత్వంతో బంతులేస్తాడని, వాటిని అంచనా వేయడం కష్టమని చెప్పాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన తొలి టీ20లో అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. అశ్విన్ మార్క్ చాప్‌మన్‎ను ఔట్ చేయడంతో గుప్టిల్, చాప్‌మన్ 109 పరుగుల భాగస్వామ్యానికి ముగిపు పలికాడు. ఈ మ్యాచ్‎లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

“అతను ఒక తెలివిగల బౌలర్, అతను తన లైన్, లెంగ్త్‌పై గొప్ప నియంత్రణను కలిగి ఉన్నాడు. అతను చెత్త బంతులు వేయడు. అతను తన కెరీర్‌లో నాకు ఎటువంటి చెత్త బంతులు వేసినట్లు నాకు గుర్తు లేదు.” అని గుప్టిల్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పాడు. “అతను తప్పించుకోవడం చాలా కష్టం, అతని పేస్ మార్పు చాలా సూక్ష్మంగా ఉంటుంది. అతడిని తప్పించుకోవడం చాలా కష్టం” అని గుప్టిల్ చెప్పాడు. ఒక దశలో కివీస్ 180 పరుగులు చేసేలా కనిపించింది. కానీ అశ్విన్ వెంటవెంటనే చాప్‌మన్, ప్రమాదకరమైన గ్లెన్ ఫిలిప్స్ ఔట్ చేయడంతో వారు 164 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్‎‎తో రోహిత్ శర్మ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. 36 బంతుల్లో 48 పరుగులు చేసిన రోహిత్ బౌల్డ్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. 40 బంతుల్లో 62 పరుగులు చేసిన సూర్యకుమార్ కూడా వెనుదిరగడంతో ఇండియా కష్టాల్లో పడింది. శ్రేయస్స్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో ఇండియా విజయంపై ఉత్కంఠ నెలకొంది. కానీ రిషభ్ పంత్ 17 బంతుల్లో 17 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. కివీస్ బౌలర్లలో ఫర్గిసన్, డారిల్ మిచెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బౌల్ట్, సౌథీ, అస్ట్లే ఒక్కో వికెటు తీశారు.

Read Also.. cheteshwar pujara: పుజారాకు క్షమాపణలు చెప్పిన రఫీక్, జాక్ బ్రూక్స్.. ఎందుకంటే..