INDIA VS ENGLAND 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీం ఇండియాకు కీలకంగా మారిన మ్యాచ్..
INDIA VS ENGLAND 2021 : రెండో టెస్టులో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు జరిగిన తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలి
INDIA VS ENGLAND 2021 : రెండో టెస్టులో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు జరిగిన తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించి మ్యాచ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టుల సిరీస్లో ఆ జట్టు 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఇప్పుడు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ సిరీస్లో నిలవాలన్నా, టెస్టు ఛాంపియన్షిప్ పోటీకి అర్హత సాధించాలన్నా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఎలా ఆడనుందో వేచిచూడాలి.
భారత జట్టు: రోహిత్, శుభ్మన్, పుజారా, కోహ్లి (కెప్టెన్), రహానె, పంత్, అశ్విన్, అక్షర్, కుల్దీప్ ఇషాంత్, మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ జట్టు: సిబ్లీ, బర్న్స్, లారెన్స్, రూట్ (కెప్టెన్), స్టోక్స్, పోప్, ఫోక్స్, మొయిన్ అలీ, బ్రాడ్, స్టోన్, లీచ్.