AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అంతా భయంతోనే ఆడుతున్నారు..’: తొలి ఓటమిపై గంభీర్, అగార్కర్‌లను ఏకిపారేసిన టీమిండియా మాజీ ప్లేయర్

Team India: కఠినమైన పిచ్‌లపై భారత బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లాండ్‌లో వికెట్లు సాధారణంగా ఫ్లాట్‌గా ఉండటం వల్ల జట్టు బాగా ఆడింది. కానీ బంతి టర్నింగ్ లేదా పేస్, బౌన్స్ ఉండే పిచ్‌లపై బ్యాటింగ్ యూనిట్ ఎక్కువగా తడబడింది. సొంతగడ్డపై తమ ఆటగాళ్లు పరుగులు చేసి, మళ్లీ పట్టు సాధించడానికి మంచి బ్యాటింగ్ ట్రాక్‌లను సిద్ధం చేయాలని పిలుపునివ్వడం వివాదంగా మారింది.

'అంతా భయంతోనే ఆడుతున్నారు..': తొలి ఓటమిపై గంభీర్, అగార్కర్‌లను ఏకిపారేసిన టీమిండియా మాజీ ప్లేయర్
Indian Team
Venkata Chari
|

Updated on: Nov 19, 2025 | 8:57 AM

Share

India vs South Africa: భారత జట్టు సొంతగడ్డపై అజేయమనే అనే అపోహ, వరుస ఓటములతో బద్దలైంది. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌ చేతిలో 3-0 తేడాతో ఓడిపోకముందే, దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కూడా ఓడిపోయింది. తద్వారా టర్నింగ్ పిచ్‌లపై భారత జట్టు బలహీనతలు బయటపడ్డాయి. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కు ఈజీగా అవ్వాల్సింది. కానీ, కఠినమైన వికెట్‌పై ఛేదనను అస్తవ్యస్తం చేసి, 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.

ఈ అవమానకరమైన ఓటమికి మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను నిందించారు. భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కకపోవడాన్ని హైలైట్ చేస్తూ, మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం లేదని, జట్టులో తమ స్థానం గురించి అభద్రతా భావం ఉండటం వల్ల ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడలేకపోతున్నారని కైఫ్ అన్నారు.

“ఆడుతున్న ఆటగాళ్లందరికీ, తమకు మద్దతుగా ఎవరైనా ఉన్నారనే భావన లేదు. కోయి బ్యాకింగ్ నహీ హై, సబ్ దర్ కే ఖేల్ రహే హై. (ఎలాంటి మద్దతు లేదు; అందరూ భయంతో ఆడుతున్నారు.) సబ్ దర్ కే ఖేల్ రహే హై, కోయి ఖుల్ కే నహీ ఖేల్ రహా (అందరూ భయంతో ఆడుతున్నారు, ఎవరూ స్వేచ్ఛగా ఆడటం లేదు)” అని ఆయన యూట్యూబ్‌లో అన్నారు.

ఇవి కూడా చదవండి

“సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసిన తర్వాత కూడా అతని స్థానం ఖాయం కాలేదు. సెంచరీ చేసిన తర్వాత కూడా అతను తిరిగి జట్టులోకి రాలేకపోతున్నాడు. సాయి సుదర్శన్ 87 పరుగులు చేశాడు. అతను తదుపరి టెస్ట్ మ్యాచ్ ఆడడు. ఈ జట్టులో చాలా గందరగోళం ఉందని నేను భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

భారత బ్యాటింగ్ విఫలం..

కఠినమైన పిచ్‌లపై భారత బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లాండ్‌లో వికెట్లు సాధారణంగా ఫ్లాట్‌గా ఉండటం వల్ల జట్టు బాగా ఆడింది. కానీ బంతి టర్నింగ్ లేదా పేస్, బౌన్స్ ఉండే పిచ్‌లపై బ్యాటింగ్ యూనిట్ ఎక్కువగా తడబడింది. సొంతగడ్డపై తమ ఆటగాళ్లు పరుగులు చేసి, మళ్లీ పట్టు సాధించడానికి మంచి బ్యాటింగ్ ట్రాక్‌లను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కానీ, గౌతమ్ గంభీర్ తిరిగే పిచ్‌లను తయారుచేసే ప్రస్తుత విధానాన్ని భారత్ కొనసాగించవచ్చని సూచించారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన తర్వాత, భారత ఓటమికి పిచ్‌ను నిందించడానికి నిరాకరిస్తూ, బ్యాటర్లకు తిరిగే పిచ్‌లపై ఎలా ఆడాలో తెలిసి ఉండాలని ఆయన అన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..