AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan: టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధం.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతో తెలుసా?

Asia cup 2023 Reserve Day కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనట్లు తెలుస్తోంది. ఆదివారం తర్వాత, సోమవారం కూడా వర్షం కొనసాగింది. ఇటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ జట్టు నేరుగా బ్యాటింగ్‌కు వస్తే, లక్ష్యంలో కొంత మార్పు ఉండవచ్చు.

India vs Pakistan: టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధం.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతో తెలుసా?
Ind Vs Pak Asia Cup
Venkata Chari
|

Updated on: Sep 11, 2023 | 4:22 PM

Share

Asia cup 2023: భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఆసియాకప్‌ సూపర్ 4 మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్న ప్రశ్న అలాగే కొనసాగుతోంది. ఆదివారం ప్రారంభమైన మ్యాచ్ సోమవారం వరకు టెన్షన్ కొనసాగుతూనే ఉంది. కొలంబోలో వర్షం దాగుడుమూతల ఆటలో ఆటగాళ్ల నుంచి ఫ్యాన్స్ వరకు అసహనంగా కనిపిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇక్కడ వర్షం కురుస్తుండటంతో అది సాధ్యం కాలేదు. ఈరోజు మ్యాచ్ ప్రారంభమైనా టీమిండియా బ్యాటింగ్ చేస్తుందా.. ఓవర్లు తగ్గిస్తారా అన్నది ప్రశ్నగా మారింది.

ఆదివారం మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. ఇప్పుడు ఓవర్లు తగ్గిస్తే టీమ్ ఇండియా బ్యాటింగ్ కష్టమే. అంటే పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించినా లక్ష్యంలో కొంత తేడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్లు తగ్గిస్తే పాకిస్థాన్‌కు ఇక్కడ ఎంత లక్ష్యం వస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

పాకిస్థాన్ లక్ష్యం ఎంత ఉండొచ్చంటే?

భారత్‌ 20 నుంచి 24 ఓవర్ల వరకు బౌలింగ్‌ చేస్తే పాకిస్థాన్‌కు ఎంత టార్గెట్‌ వస్తుంది అనేది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ ట్వీట్‌ను షేర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌ను ట్వంటీ-ట్వంటీగా మార్చినట్లయితే, పాకిస్తాన్ గెలవాలంటే 181 పరుగులు చేయాల్సి ఉంటుంది.

పాక్ టార్గెట్ ఇలా ఉంటుంది..

20 ఓవర్లు- 181

21 ఓవర్లు- 187

22 ఓవర్లు- 194

23 ఓవర్లు- 200

24 ఓవర్లు- 206

మ్యాచ్ జరగకపోతే ఏమవుతుంది?

కొలంబోలో వాతావరణం నెలకొనడం వల్ల ఈ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ఇంకా ఆసియాకప్‌లో ఫైనల్స్‌కు చేరుకోగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. రెండు రోజుల పాటు సాగిన సూపర్-4 దశలో టీమిండియాకు ఇదే తొలి మ్యాచ్. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే టీమ్ ఇండియాకు 1 పాయింట్ వస్తుంది.

ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంకతో టీమిండియా ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే టీమిండియా సులువుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. కానీ, ఏదైనా ఒక మ్యాచ్‌లో ఓటమి లేదా వర్షం అంతరాయం కలిగితే, టీం ఇండియా ఇతర జట్ల విజయం, నెట్ రన్ రేట్‌పై ఆధారపడవలసి ఉంటుంది. ఒకవేళ శ్రీలంకతో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే.. పాకిస్థాన్-శ్రీలంక జట్లు ఫైనల్ చేరే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వివరాలు..

24.1 ఓవర్లు, 147/2

కేఎల్ రాహుల్ 17 నాటౌట్.

విరాట్ కోహ్లీ 8 నాటౌట్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..