AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : రెండు సెంచరీలు, 5 డకౌట్లు.. విదేశీ గడ్డపై సంజూ శాంసన్ ఘోరమైన రికార్డు

Sanju Samson : ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో మరోసారి విఫలమైన సంజూ శాంసన్‌పై ఒత్తిడి పెరిగింది. విదేశాల్లో వరుస వైఫల్యాలతో అతని స్థానంపై సందేహాలు నెలకొనగా, రెండో టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశాలు మరింత బలపడ్డాయి.

Sanju Samson : రెండు సెంచరీలు, 5 డకౌట్లు.. విదేశీ గడ్డపై సంజూ శాంసన్ ఘోరమైన రికార్డు
Sanju Samson
Rakesh
|

Updated on: Jul 02, 2026 | 6:44 AM

Share

Sanju Samson : భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్ ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, టీమిండియా మేనేజ్‌మెంట్ గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ కుర్రాడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. యువ ఆటగాళ్లను ఆడించడంలో తొందరపడకూడదని జట్టు భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం సంజూ శాంసన్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలం కావడమే. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో కేవలం 1 రన్ మాత్రమే చేసి సంజూ పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి ఐర్లాండ్ టూర్‌లోనే సంజూ శాంసన్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఆ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో 5 పరుగులు మాత్రమే చేసిన సంజూ, రెండో మ్యాచ్‌లో కనీసం ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొదటి మ్యాచ్‌లో రెండో ఓవర్ తొలి బంతికే అవుట్ కాగా, రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ పారేసుకున్నాడు. ఈ ఫ్లాప్ షో ఇంగ్లాండ్ గడ్డపై కూడా కొనసాగింది. చేస్టర్-లే-స్ట్రీట్‌లో జరిగిన మొదటి టీ20లో కూడా రెండో ఓవర్‌లోనే కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. కేవలం కొన్ని నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్‌లో 300 కంటే ఎక్కువ రన్స్ చేసి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచి, భారత్‌ను వరల్డ్ ఛాంపియన్‌గా నిలబెట్టిన సంజూ.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రాగానే ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్స్ నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వరల్డ్ కప్, ఐపీఎల్ సీజన్లలో సంజూ శాంసన్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్న మాట నిజమే కానీ, ఆ మ్యాచ్‌లన్నీ భారత పిచ్‌లపైనే జరిగాయి. ఇండియా దాటి బయటకు వస్తే సంజూ రికార్డులు చాలా దారుణంగా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో భారత వెలుపల ఆడిన గత 10 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే, అందులో సంజూ రెండు అద్భుత సెంచరీలు సాధించినప్పటికీ.. మిగిలిన ఇన్నింగ్స్‌లలో ఏకంగా 5 సార్లు డకౌట్ కావడం గమనార్హం. మిగిలిన మూడు ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లు వరుసగా 2, 5, 1 పరుగులు మాత్రమే. ఈ గణంకాలు చూశాక విదేశీ పిచ్‌లపై సంజూ టెక్నిక్‌ను నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

సంజూ శాంసన్ వరుస వైఫల్యాల వల్ల ఇప్పుడు ప్లేయింగ్-11 లో అతని స్థానానికి గండం పొంచి ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ లు వరల్డ్ కప్ హీరోలకు పూర్తి సపోర్ట్ ఇస్తామని పదే పదే చెప్తున్నప్పటికీ, విదేశాల్లో సంజూ బ్యాటింగ్ తీరు చూస్తుంటే అతనిని తదుపరి మ్యాచ్‌లో పక్కన పెట్టక తప్పదనిపిస్తోంది. దీనివల్ల జూలై 4న మ్యాంచెస్టర్ వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసే అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 రన్స్ బాదిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌ను తుది జట్టులోకి తీసుకుంటే జట్టు ఓపెనింగ్ సమస్య కూడా తీరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us