AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG Match Report: 20 ఏళ్ల తర్వాత.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. వరుసగా 6వ విజయం..

ICC World Cup Match Report, India vs England: రోహిత్ సారథ్యంలోకి భారత జట్టు వన్డే ప్రపంచ కప్ 2023లో వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని నమోదుచేసి, అజేయంగా టోర్నీలో దూసుకపోతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై 20 ఏళ్లుగా ఎదురవుతోన్న ఓటములకు చెక్ పెట్టింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

IND vs ENG Match Report: 20 ఏళ్ల తర్వాత.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. వరుసగా 6వ విజయం..
Cwc 2023 Team India
Venkata Chari
|

Updated on: Oct 29, 2023 | 9:27 PM

Share

ICC World Cup Match Report, India vs England: 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఆరో విజయం సాధించింది. భారత్ జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఆ జట్టు చివరిసారిగా 2003లో డర్బన్ మైదానంలో 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.

లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి

భారత బౌలింగ్ ముందు ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ తడబడుతూ కనిపించారు. మహ్మద్ షమీ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశారు. కాగా స్పిన్ జోడీ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు.

ఆరంభం వచ్చినా.. అదరగొట్టిన భారత బౌలర్లు..

230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టుకు శుభారంభం లభించింది. ఆ జట్టు 4 ఓవర్లలో 26 పరుగులు చేయగా, మహ్మద్ సిరాజ్ 2 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చాడు. కానీ, 5వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా వరుస బంతుల్లో డేవిడ్ మలన్, జో రూట్ వికెట్లు పడగొట్టి భారత్‌కు బ్రేక్ త్రూ అందించాడు.

బుమ్రా తర్వాత, మరుసటి ఓవర్‌లో మహ్మద్ షమీ బౌలింగ్‌కు వచ్చాడు. అతను ఓవర్లో 3 పరుగులు ఇచ్చాడు. తర్వాతి ఓవర్ మెయిడెన్. స్పెల్ కొనసాగించిన షమీ 8వ ఓవర్ చివరి బంతికి బెన్ స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. 9వ ఓవర్‌లో బుమ్రా మళ్లీ మెయిడిన్ బౌలింగ్ చేయగా, 10వ ఓవర్ తొలి బంతికి షమీ జానీ బెయిర్‌స్టోను బౌల్డ్ చేశాడు.

4 ఓవర్లలో 26/0తో ఇంగ్లండ్ స్కోరు 10 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బెయిర్‌స్టో 14 పరుగులు, మలాన్ 16 పరుగులు చేయగా, రూట్, స్టోక్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు.

స్వల్ప టార్గెట్ ఇచ్చిన భారత్..

భారత జట్టు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసి, 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు ఇదే అతి తక్కువ స్కోరు. అంతకుముందు 1999లో బర్మింగ్‌హామ్ మైదానంలో భారత జట్టు 8 వికెట్లకు 232 పరుగులు చేసింది.

లక్నోలోని ఎకానా స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 87 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని కంటే ముందు శుభ్‌మన్ గిల్ 9 పరుగులు, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇంగ్లిష్ జట్టులో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు తీశారు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కీపర్/కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..