AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: టీమిండియాకు మరో షాక్.. ఓటమితోపాటు జరిమానా కూడా.. ఎందుకంటే?

తొలి వన్డేలో ఓటమితో పాటు, స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టు జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. జట్టుకు ఎంత జరిమానా విధించారంటే..

IND vs BAN: టీమిండియాకు మరో షాక్.. ఓటమితోపాటు జరిమానా కూడా.. ఎందుకంటే?
India Vs Bangladesh
Venkata Chari
|

Updated on: Dec 06, 2022 | 6:35 AM

Share

IND vs BAN, 1st ODI: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఓటమితో పాటు స్లో ఓవర్ రేట్ కూడా జట్టుకు సమస్యగా మారింది. దీంతో భారత జట్టుకు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా, భారత జట్టు మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది.

మ్యాచ్ రిఫరీ, ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడు రాజన్ మదుగల్లె జట్టుపై ఈ జరిమానా విధించారు. సమయానికి ఓవర్లు పూర్తి చేయడంలో భారత జట్టు విఫలమైంది. జట్టు సమయానికి నాలుగు ఓవర్లు వెనుకంజలో నిలిచింది. ఐసీసీలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్‌కు ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో 20 శాతం మినహాయించారు. దీంతో భారత జట్టు 4 ఓవర్లు వెనుకబడి ఉంది. దీంతో ఆటగాళ్లందరి ఫీజులో 80 శాతం జరిమానా విధించారు. రోహిత్ శర్మ శిక్షను అంగీకరించాడు. దీని తర్వాత అధికారిక విచారణ అవసరం లేదు.

సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఆధిక్యం..

ఈ మ్యాచ్‌లో గెలిచిన బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ టూర్‌లో ఇరుజట్ల మధ్య మొత్తం 3 వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. తొలి మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆరంభంలో మంచి లయతో కనిపించినా వరుసగా వికెట్ల పతనం కొనసాగింది. ఒకానొక దశలో భారత జట్టు మ్యాచ్‌లో పుంజుకున్నట్లే అనిపించింది. బంగ్లాదేశ్ 136 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మెహదీ హసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..