AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: భారత్‌తో టీ20 సిరీస్‌.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన..షకీబ్ స్థానంలో డేంజరస్ ఆల్ రౌండర్

ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఆ తర్వాత అక్టోబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా తన జట్టును ప్రకటించింది.

IND vs BAN: భారత్‌తో టీ20 సిరీస్‌.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన..షకీబ్ స్థానంలో డేంజరస్ ఆల్ రౌండర్
India Vs Bangladesh
Basha Shek
|

Updated on: Oct 01, 2024 | 7:15 AM

Share

ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఆ తర్వాత అక్టోబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా తన జట్టును ప్రకటించింది. దీని ప్రకారం బంగ్లాదేశ్ జట్టుకు నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 క్రికెట్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ రిటైర్మెంట్ తీసుకోవడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు స్పిన్ ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ జట్టులోకి ఎంపికయ్యాడు. 2022 డిసెంబర్‌లో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో, కొన్ని వారాల క్రితం పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్. అయితే గత కొంతకాలంగా అతను టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపిక కాలేదు. అయితే ఇప్పుడు బోర్డు అతనికి మళ్లీ అవకాశం ఇవ్వడంతో జులై 2023 తర్వాత మెహదీ హసన్ మళ్లీ పొట్టి ఫార్మాట్ లో కనిపించనున్నాడు.

నిజానికి, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 4 రోజుల క్రితమే మిరాజ్ పునరాగమనం కారణంగా టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో కాన్పూర్ టెస్టుకు ముందు షకీబ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇకపై టీ20 ఫార్మాట్‌లో ఆడనని చెప్పాడు. అటువంటి పరిస్థితిలో, షకీబ్ స్థానంలో బంగ్లాదేశ్ జట్టుకు అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ అవసరం ఉన్న నేపథ్యంలో మిరాజ్‌పై బోర్డు నమ్మకముంచింది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లో మిరాజ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌లో భాగమైన బ్యాట్స్‌మెన్ సౌమ్య సర్కార్‌ను జట్టు నుంచి తప్పించగా, మరోవైపు పర్వేజ్ హొస్సేన్ ఎమాన్, రకీబుల్ హసన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు.

బంగ్లాదేశ్ టీ20 జట్టు:

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హోస్సేన్ ఎమాన్, తౌహిద్ హృదయ్, మహమూద్ ఉల్లా, లిటెన్ కుమార్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షాక్ మహేదీ హసన్, రిషాద్ హుస్సేన్, ముస్త్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, రకీబుల్ హసన్.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 6 నుంచి 12 వరకు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.

టీ20 సిరీస్ షెడ్యూల్

  • అక్టోబర్ 6- మొదటి టీ20, గ్వాలియర్
  • అక్టోబర్ 9 – 2వ టీ20, న్యూఢిల్లీ
  • అక్టోబర్ 12- 3వ టీ20, హైదరాబాద్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..