AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: నాగ్‌పూర్‌లో అరంగేట్రం చేయనున్న ఇద్దరు యంగ్ ప్లేయర్స్.. తొలి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ XI ఎలా ఉండనుందటే?

Suryakumar Yadav: భారత్-ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ వేదికగా టెస్టు సిరీస్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవచ్చు.

IND vs AUS: నాగ్‌పూర్‌లో అరంగేట్రం చేయనున్న ఇద్దరు యంగ్ ప్లేయర్స్.. తొలి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ XI ఎలా ఉండనుందటే?
Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Feb 08, 2023 | 8:45 PM

Share

India Playing 11 vs Australia 1st Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు సూర్య అద్భుతమైన ఆటతో సత్తా చాటాడు. టీ20లో భారత్ తరపున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. వన్డేల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. అయితే, ప్రస్తుతం అతను టెస్టు అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. నాగ్‌పూర్‌లో జరిగే మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇవ్వవచ్చు.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలని టీమ్‌ ఇండియా భావిస్తోంది. ఈ కారణంగా, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఫాంలో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాడు. మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు భారత జట్టు సూర్యకు అవకాశం ఇవ్వగలదని తెలుస్తోంది. సూర్య ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ, అతని ఇటీవలి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే, అతను అరంగేట్రం చేసే అవకాశం పొందవచ్చని అంటున్నారు. చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌ జట్టుకు బలం. అందుకే వీటితో పాటు మిడిల్ ఆర్డర్ పై కూడా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

సూర్యకుమార్ యాదవ్ మార్చి 2021లో టీమ్ ఇండియా తరపున తన తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 46 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 1675 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 3 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు సాధించాడు. సూర్య తన తొలి వన్డేను జులై 2021లో ఆడాడు. ఇప్పటి వరకు ఆడిన 18 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 433 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు అతడిని నాగ్‌పూర్ టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్ , సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..