AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 5th Test: గులాబీ రంగులో భారత ఆటగాళ్లు.. మూడో రోజు స్పెషల్ ఏంటంటే?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో లంచ్‌ వరకు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 71 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు. స్టీవ్ స్మిత్ (4 పరుగులు), మార్నస్ లాబుషాగ్నే (6 పరుగులు), సామ్ కాన్స్టాన్స్ (22 పరుగులు)లను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్‌కు పంపాడు.

IND vs AUS 5th Test: గులాబీ రంగులో భారత ఆటగాళ్లు.. మూడో రోజు స్పెషల్ ఏంటంటే?
Team India Pink Kit
Venkata Chari
|

Updated on: Jan 05, 2025 | 7:19 AM

Share

సిడ్నీలో జరుగుతోన్న 5వ టెస్ట్ మూడో రోజున భారత జట్టు గులాబీ రంగులో కనిపిస్తోంది. అందుకు ఓ కారణం కూడా ఉంది. తొలి రోజు నుంచి కేవలం ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఇలా కనిపించగా.. మూడో రోజు భారత ఆటగాళ్లు కూడా ఇలాగే కనిపించారు. గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ గౌరవార్థం మూడో రోజున భారత ఆటగాళ్లు పింక్ డ్రెస్‌లతో కనిపించారు.

మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు భారత జట్టు సంతకం చేసిన క్యాప్‌లను అందించింది. మెక్‌గ్రాత్ ఫౌండేషన్ కోసం డబ్బును సేకరించడానికి సిడ్నీ టెస్ట్ మూడవ రోజును పింక్ డే అని పిలుస్తుంటారు. ఇందుకోసమే భారత ఆటగాళ్లు కూడా గులాబీ రంగులో కనిపించారు.

ఇవి కూడా చదవండి

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో కొత్త ఏడాదిలో నిర్వహించే తొలి టెస్టును కూడా ‘పింక్ టెస్ట్’ అని పిలుస్తుంటారు. మ్యాచ్ సమయంలో, స్టాండ్‌లు, వేదిక చుట్టూ ఉన్న సూచికలు, స్టంప్‌లు కూడా గులాబీ రంగులో ఉంటాయి.

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. గ్లెన్ తన భార్య జేన్‌ను ఇదే వ్యాధితో కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2005లో మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. రొమ్ము క్యాన్సర్ రోగులు, ప్రాణాలతో బయటపడిన వారికోసం అలాగే ఈ వ్యాధిపై అవగాహనతో, నిధులను సేకరించేందుకు ఈ ఫౌండేషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా సహకరిస్తుంది. ఈ క్రమంలో మూడో రోజు భారత జట్టు గులాబీ రంగులో కనిపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..