AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటి ‘రిజర్వ్‌ డే’ విన్నర్ ఇండియానే.. మరి ఇప్పుడు..?

వర్షం కారణంగా ప్రపంచకప్‌‌ సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడింది. కాగా నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇక ఈ రోజు 46.2ఓవర్ల నుంచి మ్యాచ్‌ తిరిగి ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్‌లో భారత్‌‌ ప్రత్యర్థిగా ఉన్న మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడటం రెండోసారి. 1999లో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ కూడా […]

నాటి ‘రిజర్వ్‌ డే’ విన్నర్ ఇండియానే.. మరి ఇప్పుడు..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2019 | 4:08 PM

Share

వర్షం కారణంగా ప్రపంచకప్‌‌ సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడింది. కాగా నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇక ఈ రోజు 46.2ఓవర్ల నుంచి మ్యాచ్‌ తిరిగి ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్‌లో భారత్‌‌ ప్రత్యర్థిగా ఉన్న మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడటం రెండోసారి. 1999లో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ కూడా రిజర్వ్‌ డేకు వాయిదా పడింది.

అప్పుడు తొలి రోజు భారత ఇన్నింగ్స్ 8 వికెట్ల నష్టానికి 232 పరుగులతో ముగిసి.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక వర్షం వచ్చింది. దీంతో మరుసటి రోజుకు వాయిదా పడింది. ఇక ఆ మ్యాచ్‌లో భారత టీమ్ 63పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. నాటి ఓపెనర్ సౌరవ్ గంగూలీ 40పరుగులు, 3వికెట్ల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పుడు కూడా రిజర్వ్‌ డే భారత్‌కు కలిసివస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. కాగా వర్షం కారణంతో ఇవాళ కూడా మ్యాచ్ జరగకపోతే.. 15పాయింట్లతో పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఇండియా డైరక్ట్‌గా ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.