AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI : టీమిండియాకు షాక్.. కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధం.. ఇద్దరు కోచ్ లపై వేటు ?

ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ లపై బీసీసీఐ వేటు వేసే అవకాశం ఉంది. అయితే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవి సురక్షితంగా ఉన్నప్పటికీ, కుల్దీప్ యాదవ్ ఎంపికపై విభేదాలు నెలకొన్నాయి.

BCCI : టీమిండియాకు షాక్.. కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధం.. ఇద్దరు కోచ్ లపై వేటు ?
Gautam Gambhir
Rakesh
|

Updated on: Jul 29, 2025 | 9:11 AM

Share

BCCI : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 2024-25 ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన జట్టు సపోర్ట్ స్టాఫ్‌లోని కొందరు సభ్యులపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలిలో ఆందోళనలు పెరిగాయని, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్‎ల పదవులు ప్రమాదంలో ఉన్నాయని నివేదికలు వస్తున్నాయి. ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎలా ముగించినా, ఇద్దరు కోచ్‌లను తొలగించాలని బీసీసీఐ గట్టిగా ఆలోచిస్తోంది. సమయం తక్కువగా ఉండడం వల్ల సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ వరకు వీరు పదవిలో ఉండే అవకాశం ఉంది.

మోర్కెల్, టెన్ డోస్‌చేట్ లను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గతేడాది బాధ్యతలు స్వీకరించినప్పుడు వారిద్దరి సిఫార్స్ చేశారు. అయితే, వీరిద్దరూ తమ తమ స్థానాల్లో, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో రాణించడంలో విఫలమయ్యారు. మాజీ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్కెల్‌ను భారత పేసర్లలో పురోగతి లేకపోవడం పై బోర్డు విమర్శించింది. మరోవైపు, జట్టు సెటప్‌కు టెన్ డోస్‌చేట్ చేసిన ప్రత్యేక సహకారంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గంభీర్ ఇంతకుముందు ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‎లో మోర్కెల్ తో కలిసి పనిచేశాడు. అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్‎ లో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో పాటు టెన్ డోస్‌చేట్ తో కలిసి పనిచేశాడు. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ నిరాశపరిచే ప్రదర్శన తర్వాత నాయర్ ఇప్పటికే కోచింగ్ గ్రూప్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుత కోచింగ్ యూనిట్ 13 టెస్ట్ మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించింది. దీంతో మార్చాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

టీమ్ సెలక్షన్, ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లేకపోవడంపై నిర్ణయాలు తీసుకునేవారి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. కుల్దీప్ మ్యాచ్-విన్నర్‌గా పరిగణించబడుతున్నప్పటికీ, బ్యాటింగ్ డెప్త్, ఆల్-రౌండర్లకు మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సిరీస్‌లో ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , ప్యానెల్ సభ్యుడు శివ్ సుందర్ దాస్, ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జట్టుతో ఉన్నారని, వారిని కూడా బోర్డు నిశితంగా పరిశీలిస్తున్నట్లు నివేదిక సూచిస్తుంది. బీసీసీఐకి ప్రధాన ఆందోళన మోర్కెల్ పట్ల ఉందని, అతను ఏ పేసర్‌ను డెవలప్ చేయలేకపోయాడని అధికారులు భావిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. వెస్టిండీస్‌తో భారత్ తదుపరి టెస్ట్ సిరీస్‌కు ముందు, బీసీసీఐ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us