Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 9మంది సారథ్యం.. ఇద్దరే విజేతలు.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ల పూర్తి జాబితా ఇదే?

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా అన్ని జట్లు పూర్తి సన్నద్ధం కానున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు తప్ప మిగతా అన్ని జట్లు తమ స్వ్కాడ్‌లను ప్రకటించాయి. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత కెప్టెన్లు ఎంతమంది పాల్గొన్నారు, ఎవరు ట్రోఫీని గెలిచారో ఓసారి చూద్దాం..

Team India: 9మంది సారథ్యం.. ఇద్దరే విజేతలు.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ల పూర్తి జాబితా ఇదే?
Team India Champions Trophy
Follow us
Venkata Chari

|

Updated on: Jan 22, 2025 | 7:47 AM

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్‌లో టీమిండియాకు మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం వహించాడు. 1998లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. వెస్టిండీస్ చేతిలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

  1. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ ఎడిషన్‌లో, జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
  2. 2002 ఎడిషన్‌లో సౌరవ్ గంగూలీ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఎడిషన్‌లో, భారత్ ఫైనల్స్‌కు చేరుకుంది. అక్కడ శ్రీలంకతో టైటిల్ పోరు జరిగింది. కానీ, ఫైనల్ ఫలితం ప్రకటించలేదు. దీని కారణంగా రెండు జట్లు ఉమ్మడి విజేతలుగా నిలిచాయి.
  3. 2004 ఎడిషన్‌లో సౌరవ్ గంగూలీ కూడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక్కడ భారత ప్రదర్శన చాలా నిరాశపరిచింది. జట్టు ఏడో స్థానంలో నిలిచింది.
  4. రాహుల్ ద్రవిడ్ 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో జట్టు 5వ స్థానంలో నిలిచింది.
  5. ఎంఎస్ ధోని 2009 ఎడిషన్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ, అతని కెప్టెన్సీలో కూడా జట్టు 5వ స్థానంలో కొనసాగింది.
  6. 2013లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.
  7. 2017 ఎడిషన్‌లో, విరాట్ కోహ్లి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. అక్కడ, పాకిస్తాన్ టైటిల్ గెలవాలనే భారత్ కలను విచ్ఛిన్నం చేసింది. దీంతో భారత్ 180 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
  8. 2017 తర్వాత, ఇప్పుడు అంటే 2025లో, 8 ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించబోతున్నారు. ఇందులో రోహిత్ శర్మ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..