రోహిత్-విరాట్ మాత్రమే కాదు భయ్యో.. బీజీటీ దెబ్బకు రిటైర్మెంట్ చేసిన మరో ఆరుగురు.. ఎవరో తెలుసా?

Team India: బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత చాలామంది ఆటగాళ్ల కెరీర్లు ముగియడం గమనార్హం. ఎందుకంటే ఈ సిరీస్ చాలా మంది ఆటగాళ్ల ఫ్యూచర్‌ను నిర్ణయిస్తుంది. ఒక జూనియర్ ఆటగాడు పరుగులు సాధించడంలో విఫలమైతే, అతన్ని పక్కన పెడతారు. మరి సీనియర్ల పరిస్థితి ఊహించని విధంగా రిటైర్మెంట్ వైపు వెళ్తోంది.

రోహిత్-విరాట్ మాత్రమే కాదు భయ్యో.. బీజీటీ దెబ్బకు రిటైర్మెంట్ చేసిన మరో ఆరుగురు.. ఎవరో తెలుసా?
Virat Kohli Rohit Sharma

Updated on: May 14, 2025 | 8:15 AM

Virat Kohli – Rohit Sharma: ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీం ఇండియా 3-1 తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ఓటమితో, WTC ఫైనల్‌కు చేరుకోవాలనే భారత జట్టు కల చెదిరిపోయింది. ఆ తరువాత, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ భారత ఆటగాళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిద్దరి పేలవమైన ప్రదర్శనే పదవీ విరమణకు కారణమైంది. ఈ ఇద్దరు మాత్రమే కాదు, భారత క్రికెట్ చరిత్రలో బోర్డర్ గవాస్కర్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత పదవీ విరమణ చేసిన చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. వీరిలో పరుగుల వర్షం కురిపించిన ఇద్దరు ఆటగాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు ఆటగాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే కాదు ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రిటైర్ అయ్యారు.

భారత క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ పేరు వినని వారు ఉండరు. తన విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ తరపున అనేక మ్యాచ్‌లను గెలిచాడు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విధంగానే వీరు కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 2012–13లో భారతదేశంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్‌లో చివరిదిగా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ సిరీస్ తర్వాత, సెహ్వాగ్‌ను జట్టు నుంచి తొలగించారు. ఆ తర్వాత తిరిగి వచ్చే అవకాశం రాలేదు. తన టెస్ట్ కెరీర్‌లో 104 మ్యాచ్‌ల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 319 పరుగులుగా ఉంది. టెస్ట్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక భారతీయుడిగా నిలిచాడు.

మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ కూడా టెస్ట్ క్రికెట్ నుంచే జరిగింది. MCGలో ఆస్ట్రేలియాతో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ మధ్యలో అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ బాధ్యత విరాట్ కోహ్లీకి అప్పగించారు. ఎంఎస్ ధోని ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కానీ, అతని టెస్ట్ కెరీర్‌ను కూడా బోర్డర్ గవాస్కర్ తర్వాత ముగించాడు. ధోని 90 మ్యాచ్‌ల్లో 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో అతని 06 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో ధోని అత్యధిక స్కోరు 224 పరుగులుగా ఉంది. ధోని టెస్ట్ క్రికెట్‌లో 256 క్యాచ్‌లు, 38 స్టంప్‌లు కూడా తీసుకున్నాడు.

కెరీర్‌కు బీజీటీ నిర్ణయాత్మకం..

బోర్డర్ గవాస్కర్ తర్వాత విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్లు మాత్రమే కాకుండా సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వంటి అనేక మంది ఆటగాళ్ల కెరీర్లు కూడా ముగియడం గమనార్హం. ఎందుకంటే ఈ సిరీస్ చాలా మంది ఆటగాళ్ల కెరీర్‌ను నిర్ణయిస్తుంది. ఒక జూనియర్ ఆటగాడు పరుగులు సాధించడంలో విఫలమైతే, అతన్ని పక్కన పెడతారు. మరి సీనియర్ల పరిస్థితి ఊహించని విధంగా రిటైర్మెంట్ వైపు వెళ్తోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us