Cricket Record: చరిత్ర సృష్టించిన చెన్నై మాజీ ప్లేయర్.. విరాట్ కోహ్లీ రికార్డ్ను కూడా బ్రేక్ చేసేశాడు.. అదేంటంటే?
విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు బ్యాట్స్మెన్ ఎన్ జగదీషన్ చరిత్ర సృష్టించాడు. ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు స్టార్ బ్యాట్స్మెన్ ఎన్ జగదీశన్ భారీ రికార్డు సాధించాడు. నిజానికి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్ల్లో 830 పరుగులు చేశాడు. ఒక సీజన్లో బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం.
విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఎన్ జగదీషన్..
విజయ్ హజారే ట్రోఫీలో ఎన్. జగదీషన్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిసింది. ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్ల్లో 830 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 138.33గా నిలిచింది. అదే సమయంలో అతను విజయ్ హజారే ట్రోఫీలో 5 సెంచరీలు చేశాడు. విశేషమేమిటంటే, అతను వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఈ 5 సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్పై ఎన్ జగదీసన్ ఈసారి 277 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు.
వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ఎన్ జదీషన్..
ఒక సీజన్లో వరుసగా ఐదు సెంచరీలు చేయడం ద్వారా భారత వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సెంచరీతో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. 2008-09 సీజన్లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు చేశాడు. వీరితో పాటు పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ కూడా ఒక సీజన్లో తలా నాలుగు సెంచరీలు సాధించారు. ఈ బ్యాట్స్మెన్లందరినీ వదిలిపెట్టి జగదీషన్ ఒక సీజన్లో తన ఐదవ సెంచరీని సాధించాడు.
ఇది కాకుండా లిస్ట్ A మ్యాచ్లలో వరుసగా ఐదు సెంచరీలు చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్మెన్గా జగదీషన్ నిలిచాడు. జగదీషన్ కంటే ముందు, కుమార సంగక్కర, దేవదత్ పడిక్కల్, ఎల్విరో పీటర్సన్ లిస్ట్ క్రికెట్లో వరుసగా 4 సెంచరీలు సాధించారు.
విజయ్ హజారే ట్రోఫీలో ఎన్. జగదీషన్ ప్రదర్శన..
ఇన్నింగ్స్ – 8
పరుగులు – 830
సగటు – 138.33
శతకాలు – 5
అత్యధిక స్కోరు – 277
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..