AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ చరిత్రలో తళుక్కున మెరిసి మాయమైన ఐదుగురు.. ఈ తోపులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా?

IPL Forgotten Heroes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయే వేదిక. అయితే కొందరు ఆటగాళ్లు ఆరంభంలో అద్భుతమైన ప్రదర్శనతో దేశం మొత్తం తన వైపు తిప్పుకున్నా, కాలక్రమేణా కనుమరుగయ్యారు. మైదానంలో పరుగుల వరద పారించి, వికెట్లు తీసి అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఆ ఐదుగురు భారతీయ ఆటగాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఈ కథనంలో చూద్దాం..

ఐపీఎల్ చరిత్రలో తళుక్కున మెరిసి మాయమైన ఐదుగురు.. ఈ తోపులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా?
Ipl Forgotten HeroesImage Credit source: X.com
Venkata Chari
|

Updated on: Apr 28, 2026 | 7:55 AM

Share

Indian cricketers IPL history: క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఒక విప్లవం. ఇక్కడ ప్రతిభ ఉంటే చాలు, మట్టిలో మాణిక్యాలు కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతారు. కానీ గాయాలు, ఫామ్ కోల్పోవడం వంటి కారణాలతో కొందరు ప్రతిభావంతులు అర్ధాంతరంగా తమ కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. ఐపీఎల్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఆ ఐదుగురు ఆటగాళ్ల ప్రస్థానం ఇదీ.

పాల్ వాల్తాటి: పంజాబ్ వీరుడు.. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో..

2011 ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున పాల్ వాల్తాటి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. బలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కేవలం 63 బంతుల్లోనే 120 పరుగులు చేసి అప్పట్లో సెన్సేషన్ సృష్టించాడు. ఆ సీజన్‌లో మొత్తం 463 పరుగులు సాధించినా, దురదృష్టవశాత్తూ కంటి గాయం కారణంగా తన ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం అతను క్రికెట్‌కు దూరమై ఎయిర్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

మన్ప్రీత్ గోనీ, సౌరభ్ తివారీ..

మొదటి సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నాడు మన్ప్రీత్ గోనీ. తన వేగవంతమైన బౌలింగ్‌తో 17 వికెట్లు తీసి చెన్నైను ఫైనల్‌కు చేర్చాడు. ఆ ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చినా, ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ వంటి టోర్నీలకు పరిమితమయ్యాడు. మరోవైపు, 2010లో ముంబై ఇండియన్స్ తరపున 419 పరుగులు చేసిన సౌరభ్ తివారీని చూసి అందరూ ‘డూప్లికేట్ ధోనీ’ అని పిలిచేవారు. అద్భుతమైన జుట్టు, భారీ షాట్లతో అలరించిన ఇతను ఇటీవల అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

స్పిన్ మాంత్రికుడు ఇక్బాల్ అబ్దుల్లా..

కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 2011లో 16 వికెట్లు పడగొట్టి ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును గెలుచుకున్నాడు ఇక్బాల్ అబ్దుల్లా. తన స్పిన్ మాయాజాలంతో దిగ్గజ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టిన ఇతను, ఐపీఎల్ మెరుపులకు దూరమైనా ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తూ తన ఉనికిని చాటుకుంటున్నాడు.

గోవా సింహం స్వప్నిల్ అస్నోద్కర్..

2008లో రాజస్థాన్ రాయల్స్ తొలిసారి టైటిల్ గెలవడంలో స్వప్నిల్ అస్నోద్కర్ పాత్ర మరువలేనిది. షేన్ వార్న్ గారాబం చేసిన ఈ ఆటగాడు ఆ సీజన్‌లో 311 పరుగులు చేసి ‘గోవా సింహం’గా గుర్తింపు పొందాడు. చిన్న వయస్సులోనే క్రికెట్‌కు దూరమైన అస్నోద్కర్, ప్రస్తుతం గోవాలో యువ క్రికెటర్లకు శిక్షణనిస్తూ మంచి కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us