Mahendra Singh Dhoni: వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. ఎఫ్ఐఆర్ నమోదు.. అసలు విషయం ఏంటంటే?
బీహార్లోని బెగుసరాయ్లో కెప్టెన్ కూల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ధోనీతో పాటు మరో ఏడుగురు నిందితులుగా ఉన్నారు.
Fir Filed Against Ms Dhoni: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కమాండ్ను తీసుకున్న భారత మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి చర్చల్లో నిలిచాడు. బీహార్లోని బెగుసరాయ్లో కెప్టెన్ కూల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ధోనీతో పాటు మరో ఏడుగురు నిందితులుగా ఉన్నారు. కాగా, ఈ కేసు మోసానికి సంబంధించినదని తెలుస్తోంది. ధోనీతో పాటు మరో ఏడుగురు ఎరువుల విక్రేతలపై ఈ కేసు పెట్టారు. రూ.30 లక్షల చెక్కు బౌన్స్ కేసులో ఈ కేసు నమోదైంది. నిజానికి ఇది రెండు కంపెనీల మధ్య వివాదం. ఒక ఎరువుల కంపెనీ తన ఉత్పత్తి విక్రయం కోసం ఎస్కే ఎంటర్ప్రైజెస్ బెగుసరాయ్ అనే ఏజెన్సీతో బంధాన్ని కలిగి ఉంది. కంపెనీ తరపున ఎరువులను ఏజెన్సీకి పంపించినా.. అక్కడి నుంచి మార్కెటింగ్కు సహకరించలేదు. ఉత్పత్తిని విక్రయించే క్రమంలో కంపెనీ తమకు సహకరించలేదని, దీని వల్ల భారీ మొత్తంలో ఎరువులు అమ్ముదవ్వలేదని ఆరోపించారు. దీని తరువాత, ఏజెన్సీ యజమాని నీరజ్, కంపెనీ సహకరించడం లేదని ఆరోపించాడు. దీని వల్ల తనకు నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చాడు.
చెక్కు బౌన్స్ అవ్వడంతో..
ఆ తర్వాత కంపెనీ మిగిలిన ఎరువులను వెనక్కి తీసుకుంది. ప్రతిఫలంగా, రూ. 30 లక్షల చెక్కును కూడా వారి ఏజెన్సీ పేరు మీద ఇచ్చారు. కానీ అది బౌన్స్ అయింది. దాని సమాచారాన్ని లీగల్ నోటీసు ద్వారా కంపెనీకి అందించారు. ఇప్పటి వరకు అది పరిష్కరించలేదు. అలాగే కంపెనీ కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. దీని తర్వాత కంపెనీ సీఈవో రాజేష్ ఆర్యతో పాటు కంపెనీకి చెందిన మరో ఏడుగురు ఆఫీస్ బేరర్లపై కేసు నమోదైంది. కాగా, ఈ ప్రొడక్ట్కు మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. కాబట్టి అతని పేరు కూడా ఫిర్యాదులో నమోదు చేశారు.
ఈ కేసులో ధోనీ పేరు..
మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఎరువుల కోసం ప్రచారం చేశాడు. అలాంటి సందర్భంలో, నీరజ్ కుమార్ నిరాలా ధోనిపై కేసు పెట్టారు. ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన కోర్టు దీనిపై తదుపరి విచారణ జూన్ 28న జరగనుంది. ఈ కేసులో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును చేర్చడంతో ఈ కేసు వార్తల్లో నిలిచింది.