AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : రిషబ్ పంత్ కొట్టిన సిక్స్ డ్రోన్‌కు తగిలిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజమేనా?

Watch : రిషబ్ పంత్ సిక్స్ డ్రోన్ కెమెరాను తాకిందంటూ వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా ఫేక్ అని తేలింది. AIతో రూపొందించిన ఈ క్లిప్‌లో వైట్ బాల్ కనిపించడం ద్వారా నిజం బయటపడింది. అఫ్గానిస్తాన్ టెస్టులో పంత్ 81 పరుగులతో రాణించాడు.

Watch : రిషబ్ పంత్ కొట్టిన సిక్స్ డ్రోన్‌కు తగిలిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజమేనా?
Rishabh Pant
Rakesh
|

Updated on: Jun 07, 2026 | 7:33 PM

Share

Watch : భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో కొట్టిన ఒక పవర్‌ఫుల్ షాట్ గాల్లో ఎగురుతున్న డ్రోన్ కెమెరాకు తగిలిందని, దాంతో అది పాడైపోయిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో క్లిప్‌లు షేర్ చేశారు. అయితే అధికారిక మ్యాచ్ బ్రాడ్‌కాస్ట్, స్టేడియం రూల్స్‌ను పరిశీలిస్తే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది.

లైవ్ మ్యాచ్ ఫీడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అలా ఏమీ జరగలేదని నిర్ధారణ అయింది. పంత్ తన మార్క్ అగ్రెసివ్ షాట్లు ఆడిన మాట వాస్తవమే కానీ, అవేవీ డ్రోన్‌ను తాకలేదు. నిజానికి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఆ క్లిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ వీడియో. ఆ వీడియోలో బౌలర్ వైట్ బాల్‌తో బౌలింగ్ చేస్తున్నట్లు ఉంది. వన్డేలు, టీ20ల్లో మాత్రమే వైట్ బాల్ వాడతారు. ప్రస్తుతం జరుగుతున్నది టెస్ట్ మ్యాచ్ కాబట్టి రెడ్ బాల్ వాడాలి. ఈ ఒక్క లాజిక్‌తోనే ఆ వైరల్ క్లిప్ పూర్తిగా నకిలీదని తేలిపోయింది.

స్టేడియంలో ప్రసారాల కోసం వాడే కెమెరాల విషయంలో బీసీసీఐ భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తుంది. మైదానంలో వాడే స్పైడర్ క్యామ్‌లు లేదా డ్రోన్ కెమెరాలు క్రికెట్ బాల్ వెళ్లే గరిష్ట ఎత్తు కంటే చాలా పైనే ఉండేలా లీగల్‌గా మేనేజ్ చేస్తారు. కాబట్టి బ్యాటర్లు కొట్టే బంతులు వాటికి తగిలే అవకాశం ఎంతమాత్రం ఉండదు. కాబట్టి ఈ డ్రోన్ క్రాష్ రూమర్ కేవలం సోషల్ మీడియా సృష్టి మాత్రమే.

ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరకు హస్మతుల్లా షాహిదీ బౌలింగ్‌లో మిడ్-ఆఫ్ మీదుగా షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అయితే ఈ ఇన్నింగ్స్ ద్వారా పంత్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారతదేశపు అత్యుత్తమ వికెట్ కీపర్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ, సయ్యద్ కిర్మాణి వంటి దిగ్గజాల సరసన చేరి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us