AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: మరో గట్టి షాక్.. ఐపీఎల్‌ సెకండాఫ్‌కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం.!

సెప్టెంబర్‌లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్‌కు ఆరంభానికి ముందే మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లీగ్‌లో..

IPL 2021: మరో గట్టి షాక్.. ఐపీఎల్‌ సెకండాఫ్‌కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం.!
Ipl 2021
Ravi Kiran
|

Updated on: May 28, 2021 | 8:49 AM

Share

సెప్టెంబర్‌లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్‌కు ఆరంభానికి ముందే మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లీగ్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ క్రికెటర్లు దూరం కానున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ టీమ్ ఎండీ ఆష్లే గిల్స్ స్పష్టం చేశాడు. ”ఐపీఎల్ 14వ సీజన్ సెకండాఫ్‌ ఆడేందుకు తమ ప్లేయర్స్‌ను పంపించమని’ గిల్స్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అలాగే ఐపీఎల్‌ను నిర్వహించడానికి అవసరమైన పెద్ద విండో కోసం భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని.. సిరీస్‌ను మార్చే ఉద్దేశం ఈసీబీకి లేదని గిల్స్ తేల్చి చెప్పాడు. కాగా, టీ20 వరల్డ్‌కప్ వరకు ఇంగ్లాండ్ టీమ్‌కు బిజీ షెడ్యూల్ ఉందని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ సెకండాఫ్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆగష్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ పర్యటించనుంది. ఈ సిరీస్ పూర్తి అయ్యేసరికి ఐపీఎల్ సెకండాఫ్ సగం మ్యాచ్‌లు పూర్తవుతాయి. అటు ఆస్ట్రేలియా ప్లేయర్స్.. ఇటు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఇద్దరూ లీగ్ సెకండాఫ్‌కు దూరమైతే టోర్నీ కళావిహీనంగా మారడం ఖాయం అని చెప్పవచ్చు. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్స్ గాయాలు కారణంగా టోర్నీకి దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో లీగ్‌ను పున: ప్రారంభించడం వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుందో వేచి చూడాల్సిందే.!

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!