IND vs ENG: బుమ్రా లేకున్నా మేం తోపులమే.. వాళ్లకు పచ్చిగా ఇచ్చిపడేసిన టీమిండియా ప్రిన్స్
Shubman Gill: ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్పై టీమిండియా సాధించిన చారిత్రక విజయం తర్వాత, కెప్టెన్ శుభమన్ గిల్ జట్టుపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాడు. బుమ్రా లేకపోయినా, ఆకాష్ దీప్, సిరాజ్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించామని గిల్ తెలిపాడు. తన వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయమే ముఖ్యమని, నాయకత్వం స్థిరత్వం, క్రమశిక్షణతో ఉండాలని అన్నాడు.

Shubman Gill: ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, భారత యువ కెప్టెన్ శుభమన్ గిల్ తన జట్టుపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకున్నా జట్టు సాధించిన విజయంపై గిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 336 పరుగుల భారీ తేడాతో ఎడ్జ్బాస్టన్లో 58 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత్ సాధించిన ఈ విజయం, సిరీస్ను 1-1తో సమం చేసింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు, బుమ్రాను విశ్రాంతినిచ్చి ఆకాష్ దీప్ను ఎంపిక చేయడంపై కెప్టెన్ శుభమన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్లపై విమర్శలు వెల్లువెత్తాయి. కీలకమైన రెండో టెస్టులో సిరీస్ను సమం చేయాలని చూస్తున్న భారత్కు, బుమ్రా లేకపోవడం పెద్ద లోటని చాలా మంది భావించారు. అయితే, ఎడ్జ్బాస్టన్ టెస్టు ముగిసే సమయానికి, విమర్శల దుమారం తగ్గి, ప్రశంసలు వెల్లువెత్తాయి. భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు విదేశాల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయాన్ని అందించారు.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో శుభమన్ గిల్ మాట్లాడుతూ, “జస్ప్రీత్ భాయ్ లేకుండా, మేం పని చేయగలమా అని చాలా ప్రశ్నలు వచ్చాయి. కానీ ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు” అని అన్నాడు. “ఇది ఇంగ్లాండ్కు పర్యటించిన అత్యుత్తమ భారత జట్లలో ఒకటి. బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు, కానీ మేం ఎక్కడైనా 20 వికెట్లు తీయగలమని నమ్ముతున్నాం” అని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.
కెప్టెన్గా తన ముందున్న వ్యూహాత్మక సవాళ్లను కూడా గిల్ అంగీకరించాడు. ముఖ్యంగా పిచ్ బౌలింగ్కు అనుకూలంగా లేనప్పటికీ ఇంగ్లండ్ జట్టును ఆలౌట్ చేయడం మాములు విషయం కాదు. అయితే, ఆకాష్ దీప్, సిరాజ్ వేరియేషన్స్, స్వింగ్, పేస్లను సమర్థవంతంగా ఉపయోగించి అద్భుతాలు చేశారని గిల్ ప్రశంసించాడు. “బంతి మృదువైనప్పుడు, పరుగులు ఆపడమే అత్యంత ముఖ్యమైన విషయం. రెండో కొత్త బంతితో వికెట్లు సులభంగా వస్తాయి. మొదటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడినప్పుడు షార్ట్ పిచ్ బంతులతో రిస్క్ తీసుకోవాలనుకున్నాం, కానీ అక్కడ పరుగులు ఇచ్చేశాం” అని గిల్ వివరించాడు.
వ్యక్తిగత రికార్డులను తక్కువ చేసి మాట్లాడుతూ, “స్కోర్కార్డ్ను చూసినప్పుడు, వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించను” అని గిల్ వ్యాఖ్యానించాడు. నాయకత్వాన్ని స్థిరత్వం, క్రమశిక్షణ ద్వారా ప్రదర్శించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాడు. “కొన్నిసార్లు ఉదాహరణ ద్వారా నడిపించాలి. ఒక మంచి బంతికి నేను అవుట్ అయితే పర్వాలేదు, కానీ నేను దానిని వృథా చేయను” అని గిల్ చెప్పుకొచ్చాడు.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో గిల్ వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (269), రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఎడ్జ్బాస్టన్లో టెస్టు విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో సిరీస్లో 1-1 సమం కావడంతో, భారత్ ఇప్పుడు లార్డ్స్లో జరిగే మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యం సాధించాలని చూస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..