అమర జవాన్ల కుటుంబాలకు చెన్నై సూపర్ కింగ్స్ విరాళం

| Edited By: Ram Naramaneni

Mar 21, 2019 | 3:21 PM

ఐపీఎల్ దిగ్గజం చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) తన ఉదారతని చాటుకుంది. చేపాక్ స్టేడియంలో శనివారం బెంగళూరుతో తొలి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో వచ్చే మొత్తం ఆదాయాన్ని ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది. చెన్నై, బెంగళూరు జట్ల మధ్య పోరు కావడంతో.. మ్యాచ్ టికెట్లు గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయినట్లు సీఎస్‌కే యాజమాన్యం తెలిపింది. భారత ఆర్మీలో ప్రస్తుతం లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాలో […]

అమర జవాన్ల కుటుంబాలకు చెన్నై సూపర్ కింగ్స్ విరాళం
Follow us on

ఐపీఎల్ దిగ్గజం చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) తన ఉదారతని చాటుకుంది. చేపాక్ స్టేడియంలో శనివారం బెంగళూరుతో తొలి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో వచ్చే మొత్తం ఆదాయాన్ని ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది.

చెన్నై, బెంగళూరు జట్ల మధ్య పోరు కావడంతో.. మ్యాచ్ టికెట్లు గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయినట్లు సీఎస్‌కే యాజమాన్యం తెలిపింది. భారత ఆర్మీలో ప్రస్తుతం లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాలో ఉన్న మహేంద్రసింగ్ ధోనీ చేతుల మీదుగా మ్యాచ్ ఆదాయాన్ని సంబంధిత కుటుంబాలకు చెక్ రూపంలో అందజేయనున్నట్లు సీఎస్‌కే డైరెక్టర్ రాకేశ్ సింగ్ వివరించారు. శనివారం రాత్రి 8 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది.