AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Asia Cup 2025 : భారత్-పాక్ మ్యాచ్‌పై వందల కోట్ల బెట్టింగ్.. పాకిస్తాన్ క్రికెటర్లకు డబ్బు ఆశ చూపారా?

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత, చర్చలు జరుగుతున్నాయి. భారత జట్టు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పలు రాజకీయ వర్గాలు, నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

IND vs PAK Asia Cup 2025 :  భారత్-పాక్ మ్యాచ్‌పై వందల కోట్ల బెట్టింగ్.. పాకిస్తాన్ క్రికెటర్లకు డబ్బు ఆశ చూపారా?
India Vs Pakistan,
Rakesh
|

Updated on: Sep 14, 2025 | 4:25 PM

Share

IND vs PAK Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై అనేక అనుకూల, ప్రతికూల చర్చలు జరుగుతున్నాయి. టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ మ్యాచ్‌పై అంతర్జాతీయ స్థాయిలో బిలియన్ డాలర్ల బెట్టింగ్ జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేయడం ద్వారా కొత్త వివాదానికి తెరతీసింది.

ఆప్​ నాయకుడి సంచలన ఆరోపణలు

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్​ను షేర్ చేశారు. అందులో ఆయన.. “బిగ్ బ్రేకింగ్, భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌పై అంతర్జాతీయ స్థాయిలో బిలియన్ డాలర్ల బెట్టింగ్ జరుగుతోంది. ఇది మాత్రమే కాకుండా, పాకిస్తాన్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ విషయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలుసు అని తెలిసింది” అని రాశారు.

భారత్‌లో తీవ్ర వ్యతిరేకత

నిజానికి, ఆప్​తో పాటు అనేక రాజకీయ పార్టీలు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను రద్దు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని మినహాయించి, దాదాపు అన్ని పార్టీలు ఈ మ్యాచ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదని, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలంటే, వారితో ఎలాంటి మ్యాచ్ ఆడకూడదని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, నెటిజన్లు ఈ మ్యాచ్‌ను ఎవరూ చూడొద్దని భారతీయులకు పిలుపునిచ్చారు.

బీసీసీఐపై విమర్శలు

ఈ ఒత్తిడి మధ్య కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్న బీసీసీఐని సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే, అభిమానుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని క్రీడా మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ విషయంలో కొత్త విధానాన్ని అమలు చేస్తోందని తెలిపింది. ఆ విధానం ప్రకారం, భారత జట్టు పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదు. అలాగే, భారత జట్టు ఏ టోర్నమెంట్ లేదా మ్యాచ్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లదు. పాకిస్తాన్ జట్టు కూడా భారతదేశంలో ఆడేందుకు అనుమతించబడదు. అయితే, ఆసియా కప్ ఒక బహుళ-దేశాల టోర్నమెంట్ కాబట్టి, దానిలో భారత క్రికెట్ జట్టు ఆడకుండా అడ్డుకోలేమని మంత్రిత్వ శాఖ స్పష్టంగా తెలిపింది. ఈ కారణం వల్లనే బీసీసీఐ కూడా ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జట్టును బరిలోకి దింపుతోంది.

Follow Us
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!