AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI : ప్రపంచ కప్ 2027కు ముందు బీసీసీఐ విరాట్, రోహిత్‌లకు అల్టిమేటం.. షాకవుతున్న అభిమానులు

భారత క్రికెట్‌లో పెద్ద మార్పుల పర్వం నడుస్తోంది. మొదట కెప్టెన్సీ బాధ్యతలు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించబడ్డాయి. ఇప్పుడు బీసీసీఐ జట్టులోని ఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విషయంలో కఠిన వైఖరిని అవలంబించింది. ఈ ఇద్దరు దిగ్గజాలు భవిష్యత్తులో కూడా దేశవాళీ క్రికెట్ ఆడకపోతే, ప్రపంచ కప్ 2027 ఎంపికలో వారిని చేర్చబోమని బోర్డు స్పష్టం చేసింది.

BCCI : ప్రపంచ కప్ 2027కు ముందు బీసీసీఐ విరాట్, రోహిత్‌లకు అల్టిమేటం.. షాకవుతున్న అభిమానులు
Virat And Rohit
Rakesh
|

Updated on: Oct 06, 2025 | 4:01 PM

Share

BCCI : భారత క్రికెట్‌లో ప్రస్తుతం చాలా మార్పులు కొనసాగుతున్నాయి. కెప్టెన్సీ బాధ్యతలను యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించిన తర్వాత, ఇప్పుడు బీసీసీఐ జట్టులోని ఇద్దరు అత్యంత సీనియర్ ఆటగాళ్లు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విషయంలో కఠిన వైఖరిని అవలంబించింది. ఈ ఇద్దరు దిగ్గజాలు భవిష్యత్తులో కూడా దేశవాళీ క్రికెట్ ఆడకపోతే, ప్రపంచ కప్ 2027 జట్టు ఎంపికలో వారిని చేర్చబోమని బోర్డు స్పష్టం చేసింది. ఈ వార్త క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

మెయిన్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అక్టోబర్ 5న జరిగిన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా ప్రదర్శన ఆధారితంగా ఉంటుందని స్పష్టం చేశారు. “ప్రతి ఆటగాడికీ ఒకే రూల్ వర్తిస్తుంది. ఆటగాళ్లు అంతర్జాతీయ విధుల్లో లేనప్పుడు వారు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలి” అని అగార్కర్ గట్టిగా చెప్పారు.

కేవలం పేరు, లేదా ఎక్స్‎పీరియన్స్ మాత్రమే కాకుండా, మైదానంలో ఇటీవల చేసిన ప్రదర్శన మాత్రమే ఆటగాళ్ల స్థానాన్ని నిర్ణయిస్తుందని అగార్కర్ తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీ వంటి టోర్నమెంట్లు ఇప్పుడు జాతీయ జట్టులోకి ఎంపిక కావడానికి ముఖ్యమైన ప్రాతిపదిక అవుతాయని ఆయన నొక్కి చెప్పారు.

గత కొన్ని సంవత్సరాలుగా విరాట్, రోహిత్‌లు తరచుగా విశ్రాంతి పేరుతో కొన్ని అంతర్జాతీయ సిరీస్‌లకు దూరంగా ఉండేవారు. ఈ సమయంలో వారు దేశవాళీ టోర్నమెంట్‌లకు కూడా దూరంగా ఉండేవారు.. కానీ యువ ఆటగాళ్లు తమ స్థానాల కోసం దేశవాళీ టోర్నీల్లో కష్టపడేవారు. అయితే ఇప్పుడు బీసీసీఐ ఈ విధానానికి చెక్‌ పెట్టింది. ఎంత పెద్ద పేరున్న ఆటగాడైనా సరే, దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండకూడదని బోర్డు స్పష్టం చేసింది. ఈ కఠిన వైఖరి భారత జట్టులో క్రమశిక్షణను పెంచడానికి, పోటీ వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించబడింది.

ప్రపంచ కప్ 2027 టోర్నమెంట్‌లో ఆడాలంటే విరాట్, రోహిత్‌లు ఇప్పుడు తమ ఆటతో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుండి రిటైర్ అయినందున, వారి పూర్తి దృష్టి వన్డే ఫార్మాట్‌పై మాత్రమే ఉంది.

సీనియారిటీ లేదా గత అనుభవం కాదు, ప్రస్తుత ప్రదర్శన మాత్రమే జట్టులో స్థానాన్ని పొందేందుకు పాస్‌పోర్ట్ అవుతుంది. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీని ఇవ్వడం మరియు ఈ కఠిన ఎంపిక విధానాన్ని అవలంబించడం ద్వారా, భారత క్రికెట్ భవిష్యత్తు యువ, ఫిట్‌గా ఉన్న ఆటగాళ్ల చేతుల్లో ఉంటుందని బీసీసీఐ బలమైన సంకేతం ఇస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..