AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Meeting: మ్యాటర్ సీరియస్సే.. ముగిసిన బీసీసీఐ భేటీ.. సైలెంటుగా వెళ్లిపోయిన గిల్, గంభీర్

BCCI Meeting: బీసీసీఐ ముంబైలోని తన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అత్యంత ప్రాధాన్యమైన రివ్యూ మీటింగ్ ముగిసింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వీవీఎస్ లక్ష్మణ్ హాజరైన ఈ భేటీ అనంతరం వీరంతా మీడియాకు ఎలాంటి ప్రకటన చేయకుండా సైలెంట్‌గా వెనుతిరగడం క్రీడా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

BCCI Meeting: మ్యాటర్ సీరియస్సే.. ముగిసిన బీసీసీఐ భేటీ.. సైలెంటుగా వెళ్లిపోయిన గిల్, గంభీర్
Bcci Meeting
Rakesh
|

Updated on: Sep 03, 2026 | 4:37 PM

Share

BCCI Meeting: భారత క్రికెట్ జట్టు ఇటీవల ఎదుర్కొన్న వరుస ఓటములు, రాబోయే సవాళ్ల నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు ముంబైలో అత్యవసరంగా భేటీ అయ్యారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యక్షంగా హాజరవగా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవ్ జీత్ సైకియా, కోశాధికారి ప్రభతేజ్ సింగ్ భాటియా, తాత్కాలిక సీఈఓ హేమాంగ్ అమిన్ ఈ సుదీర్ఘ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన వెంటనే గంభీర్, గిల్, లక్ష్మణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా హెడ్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు.

టీమిండియా ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఎదుర్కొన్న దారుణ ప్రదర్శనపై బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పొట్టి ఫార్మాట్ ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత్ ఆరు టీ20 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవకపోవడంపై మేనేజ్‌మెంట్‌ను అధికారులు ప్రశ్నించారు. శ్రీలంక పర్యటనలో టెస్టు సిరీస్ గెలిచినప్పటికీ, రెండో టెస్టును డ్రాగా ముగించడంపై సమీక్షించారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు, నిలకడలేని బ్యాటింగ్ తీరుపై గంభీర్, అగార్కర్‌ల నుంచి బోర్డు వివరణ కోరింది.

ఈ భేటీలో ప్రధానంగా సీనియర్ దిగ్గజం రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనలో సెంచరీ కొట్టినప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఆయన ఉంటారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రోహిత్ వీడ్కోలుపై సాగుతున్న ప్రచారానికి బోర్డు కార్యదర్శి చెక్ పెట్టినప్పటికీ, భవిష్యత్ జట్టు నిర్మాణంలో ఆయన పాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల విషయంలో ఎలాంటి ఒత్తిడి లేనప్పటికీ రోహిత్ స్థానంపై సమీక్ష జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న న్యూజిలాండ్ ఆల్-ఫార్మాట్ పర్యటన అత్యంత కీలకంగా మారింది. అక్కడ భారత్ ఐదు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ సిరీస్ విజయం ద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలని బోర్డు భావిస్తోంది. కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, బ్యాకప్ ఆటగాళ్ల ఎంపికపై కోచింగ్ స్టాఫ్‌కు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us