Ind-Pak Match: ప్రపంచకప్‌నకు ముందే.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Asian Games 2023: భారత్-పాకిస్థాన్ మధ్య మరోసారి క్రికెట్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అంతకు మించి ముందుకు సాగితే ఫైనల్‌లో తలపడే ఛాన్స్ ఉంది. నేపాల్‌ను ఓడించి భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకోగా, హాంకాంగ్‌ను ఓడించి పాకిస్తాన్ ఇక్కడకు చేరుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్‌లోనూ దాయాదుల మధ్య పోరు జరగాలని అంతా కోరుకుంటున్నారు.

Ind-Pak Match: ప్రపంచకప్‌నకు ముందే.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Ind Vs Pak Match Asian Game

Updated on: Oct 03, 2023 | 8:39 PM

Asian Games 2023: క్రికెట్ అభిమానులు మరోసారి భారత్-పాక్ మధ్య పోటీని చూడవచ్చు. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇరు జట్లు తలపడవచ్చు. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఇరు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై టీమిండియా విజయం సాధించింది. అదే సమయంలో హాంకాంగ్‌ను ఓడించి పాకిస్థాన్ సెమీస్‌లోకి ప్రవేశించింది.

ఇరు జట్లు తమ తమ సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో గెలిస్తే ఫైనల్‌లో తలపడవచ్చు. సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ లేదా శ్రీలంకతో తలపడవచ్చు. అదే సమయంలో మలేషియా జట్టుతో టీమిండియా తలపడనుంది.

ఇవి కూడా చదవండి

నేపాల్‌పై టీమ్ ఇండియా విజయం..

మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 23 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. యశస్వితో పాటు రింకూ సింగ్ 15 బంతుల్లో 37 పరుగులు చేశాడు. భారత బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శనతో పాటు బౌలర్లు కూడా ఆకట్టుకున్నారు. దీంతో నేపాల్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ లు టీమ్ ఇండియాకు అత్యంత విజయవంతమైన బౌలర్లు. అవేశ్ 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

హాంకాంగ్‌ను ఓడించిన పాకిస్థాన్..


ఇక పాకిస్థాన్ గురించి చెప్పాలంటే హాంకాంగ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం హాంకాంగ్‌ జట్టు 18.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది.

భారత జట్టు- రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్ జట్టు- ఖాసిమ్ అక్రమ్, ఉమైర్ బిన్ యూసుఫ్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, అర్షద్ ఇక్బాల్, అసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, మీర్జా తాహిర్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ అఖ్లాక్, రోహైల్ నజీర్, షానవాజ్ ముఖాద్, ఉఫియాన్ క్యూమాన్ దహనీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..