AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : ట్రోఫీ నేను ఇస్తేనే వాళ్లు తీసుకోవాలి..ఏసీసీ సమావేశంలో నఖ్వీ అడ్డదిడ్డమైన వాదన

ఆసియా కప్ ముగిసి మూడు రోజులు గడుస్తున్నా, దాని చుట్టూ అలుముకున్న వివాదాలు మాత్రం సద్దుమణగడం లేదు. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి భారత జట్టు తొమ్మిదోసారి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, మ్యాచ్ అనంతర బహుమతి ప్రదానోత్సవంలో చోటు చేసుకున్న సంఘటనలు పెద్ద కోల్డ్ వార్‎కు దారితీశాయి.

Asia Cup 2025 : ట్రోఫీ నేను ఇస్తేనే వాళ్లు తీసుకోవాలి..ఏసీసీ సమావేశంలో నఖ్వీ అడ్డదిడ్డమైన వాదన
Mohsin Naqvi
Rakesh
|

Updated on: Oct 01, 2025 | 11:40 AM

Share

Asia Cup 2025 : ఆసియా కప్ ముగిసి మూడు రోజులు గడిచినా దాని చుట్టూ ఉన్న గొడవలు ఇంకా సద్దుమణగడం లేదు. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి మన భారత జట్టు తొమ్మిదోసారి టైటిల్‌ను గెలుచుకుంది. కానీ, మ్యాచ్ తర్వాత బహుమతి ఇచ్చే సమయంలో జరిగిన గొడవ చాలా పెద్దదిగా మారింది. ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ అయిన మొహసిన్ నఖ్వీ ఈ మొత్తం గొడవకు ముఖ్య కారణం. ఫైనల్ అయిన కొద్ది రోజులకే దుబాయ్‌లో జరిగిన ఒక ఏసీసీ మీటింగ్‌లో ఈ గొడవ మరింత పెరిగింది. మెడల్స్, ట్రోఫీ ఇప్పటికీ మన భారత జట్టుకు అందకపోవడం కొందరు అధికారులకు కోపం తెప్పించింది. మంగళవారం ఆన్‌లైన్‌లో జరిగిన ఏసీసీ, బీసీసీఐ సమావేశం కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.

“మొహసిన్ నఖ్వీ ప్రవర్తన ఏసీసీ ఛైర్మన్‌గా అసలు బాలేదు” అని ఒక అధికారి చెప్పారు. మీటింగ్ మొదలుపెట్టేటప్పుడు, ఆసియా కప్ గెలిచినందుకు భారతదేశానికి అభినందనలు కూడా చెప్పలేదు. ఆశిష్ షెలార్ పదే పదే గుర్తుచేసిన తర్వాతే అతను అలా చేశాడు. “భారత్ గెలిచిన విషయం, ట్రోఫీ ఎందుకు ఇవ్వలేదో చెప్పడానికి అతనికి అస్సలు ఇష్టం లేదు. బీసీసీఐ వాళ్ళు ట్రోఫీ, మెడల్స్ ఏసీసీ ఆఫీస్‌కు పంపిస్తే, వాటిని తీసుకుంటామని చెప్పినా, అతను తప్పించుకున్నాడు” అని ఆ అధికారి తెలిపారు. ఫైనల్ మ్యాచ్ తర్వాత బహుమతి ఇచ్చేందుకు దాదాపు గంట ఆలస్యం కావడానికి కారణం నఖ్వీనే అని తర్వాత తెలిసింది. భారత్ ఒప్పుకోకపోయినా, తానే ట్రోఫీని ఇవ్వాలని నక్వీ పట్టుబట్టాడు. ఈ ఆలస్యంపై రవిశాస్త్రి వంటి మాజీ ఆటగాళ్లు కూడా చాలా కోప్పడ్డారు.

ఈ ట్రోఫీ గొడవ ఒక్కసారిగా మొదలవ్వలేదు. టోర్నమెంట్ అంతటా భారత్, పాకిస్తాన్‌తో హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా ఒక ప్రత్యేక విధానాన్ని పాటించింది. ఇది మాజీ ఆటగాళ్ళు, టీవీ నిపుణులు, సామాన్యుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. భారత జట్టు మొదట ఐక్యతతో వ్యవహరించినప్పటికీ, పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో టీమిండియాను రెచ్చగొట్టేలా చెడ్డ చేష్టలు చేశారు. దీనికి గాను ఆటగాళ్లకు జరిమానాలు కూడా విధించారు. ఫైనల్ రాత్రి కెప్టెన్‌లను ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఇంటర్వ్యూ చేయడం వంటివి ఈ ఉద్రిక్తతను మరింత పెంచాయి.

చాలా కోపతాపాలతో సాగిన ఆసియా కప్ ముగిసినా, బీసీసీఐ ఇప్పుడు మెడల్స్, ట్రోఫీని ఏసీసీ ద్వారా సరిగ్గా, నియమాల ప్రకారం అందజేయాలని కోరుకుంటోంది. కానీ మొహసిన్ నఖ్వీ ఇప్పటికీ ఈ గొడవకు ప్రధాన కారణం. ఏదేమైనా 2025 ఆసియా కప్ అనేది భారతదేశం గెలిచినందుకు ఎంత గుర్తుంటుందో, దాని చుట్టూ జరిగిన ఈ గొడవలు, రాజకీయాల వల్ల కూడా అంతే గుర్తుండిపోతుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..