MS Dhoni Temple: భారతదేశంలో క్రికెట్ను ఒక మతంగా పరిగణిస్తుంటారు. క్రికెటర్లను దేవుళ్లుగా భావిస్తుంటారు. కొంతమంది ఆటగాళ్లను వారి అభిమానులు దేవుళ్లుగా కొలుస్తుంటారు. సచిన్ టెండూల్కర్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఇప్పుడు ఈ జాబితాలో చేరాడు. తన నాయకత్వంలో భారత్కు రెండు ప్రపంచకప్లు అందించిన మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న పాపులారిటీ ఎప్పటికీ మసకబారదు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఐదుసార్లు ట్రోఫీ విజేత మహి నేతృత్వంలో ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అంబటి రాయుడు.. చెన్నైలో ఎంఎస్ ధోనీకి ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పుకొచ్చాడు.
గత కొన్నేళ్లుగా CSK కోసం ఎంఎస్ ధోని అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో ధోని అభిమానులు ధోని గుడిని చెన్నైలో నిర్మిస్తానని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్తో రాయుడు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా, అభిమానులు రజనీకాంత్, ఖుష్బూతో సహా ప్రముఖ దక్షిణాది తారల ఆలయాలను నిర్మించారు. చెన్నైకి ధోనీ దేవుడయ్యాడని చెప్పిన రాయుడు.. వచ్చే ఏడాదిలో చెన్నైలో ఎంఎస్ ధోనీకి గుడి కట్టిస్తానని చెప్పాడు.
ధోనీ తన ఆటగాళ్లను నమ్మే వ్యక్తి, ఎప్పుడూ వదులుకోడు. అతను జట్టు, దేశం, CSK కోసం చాలా సేవలందించాడు. మహీ భారత్కు రెండు ప్రపంచకప్లు, ఐదు ఐపీఎల్, రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ అందించాడు. అందుకే చెన్నైలో ధోనీకి గుడి కట్టిస్తానని రాయుడు చెప్పుకొచ్చాడు. ఇది ఎలా ఉంటుంది? చెన్నైలో ఎక్కడ నిర్మిస్తారు అనేది ఇంకా ఖరారు కాలేదు.
ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత చెన్నైలో ధోనీకి ఇదే చివరి మ్యాచ్. CSK ప్రస్తుతం +0.528 నెట్ రన్ రేట్తో 14 పాయింట్లను కలిగి ఉంది, 13 మ్యాచ్లలో ఏడు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు మూడో స్థానంలో ఉంది. CSK ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంలో విఫలమైతే, ధోనీ తన చివరి మ్యాచ్ను ఈ సీజన్లో MA చిదంబరం స్టేడియంలో ఆడతాడు.
ఇందుకు నిదర్శనంగా రాజస్థాన్తో మ్యాచ్ ముగిసిన తర్వాత చెపాక్ స్టేడియంలో భారీ సంబరాలు జరిగాయి. ధోనీని పతకంతో సత్కరించారు. ధోనీ జట్టు మొత్తం మైదానంతో సందడి చేసింది. మే 18న బెంగళూరులో RCBతో CSK తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..