Kanaka Durga Temple: దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. కర్నాటి రాంబాబు చైర్మన్‌గా ప్రమాణం

ఎక్స్ అఫిషియో సభ్యునిగా దుర్గగుడి ప్రధాన అర్చకుడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గగుడికి రెండో సారి పాలకమండలి నియామకం జరిగింది.

Kanaka Durga Temple: దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. కర్నాటి రాంబాబు చైర్మన్‌గా ప్రమాణం
Durga Temple

Updated on: Feb 08, 2023 | 7:22 AM

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు ని ఏర్పాటైంది. దుర్గమ్మ గుడికి ట్రస్ట్ బోర్డును నియమించింది ఏపీ ప్రభుత్వం. చైర్మన్‌గా కర్నాటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా పాలకమండలి సభ్యులుగా ఎంపికైన 14 మంది బోర్డు సభ్యులతో ఈవో బ్రమరాంబ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్ అఫిషియో సభ్యునిగా దుర్గగుడి ప్రధాన అర్చకుడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గగుడికి రెండో సారి పాలకమండలి నియామకం జరిగింది.

కర్నాటి రాంబాబు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు వైసీపీ నేతలు. ఈ పాలకమండలి ఆధ్వర్యంలో దుర్గగుడి మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. గత దసరా ఉత్సవాలకు ముందు ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ పదవి కాలం ముగింది. అప్పటి నుంచి నూతన కమిటీ నియామకం జరగలేదు. ఇప్పుడు ఏర్పాటైన ఈ ట్రస్టు బోర్డు సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉండనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us