Vastu Tips: మనసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా.. తులసి, శంఖం ఇంట్లో ఈ దిశలో పెట్టుకోండి.. శుభఫలితం మీ సొంతం..
మనసు ప్రశాంతంగా లేనప్పుడు.. ఇల్లు ఎంత అందంగా ఉన్నా.. అది అసంపూర్ణంగా కనిపిస్తుంది. నేటి మనిషి జీవితం ప్రజలు ఉరుకులు పరుగులతో సాగుతోంది. మానసికంగా అలసిపోతున్నారు. హడావిడి, పని ఒత్తిడి, సోషల్ మీడియా కార్యకలాపాలు, పెరుగుతున్న పోటీ ఇవన్నీ కలిసి మానసిక అశాంతిని పెంచుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు ధ్యానం, చికిత్స, యోగా వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే మీరు మానసిక ఆరోగ్యం, శాంతి విషయంలో ఇంటి వాస్తు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మీరు ఇంట్లో మానసిక ప్రశాంతత, సానుకూల శక్తిని కోరుకుంటే.. తులసి, శంఖాన్ని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వస్తువులను సరిగ్గా ఉంచడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. అయితే తులసి మొక్క శంఖం ఇంట్లో పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయి.
తులసి మొక్క: మానసిక ప్రశాంతత మరియు సానుకూలతకు చిహ్నం. వాస్తు శాస్త్రం అంటే ఇల్లు కట్టేందుకు ఉన్న నియమాలు మాత్రమే కాదు.. అది శక్తి శాస్త్రం. మీ ఇంట్లోని ప్రతి వస్తువు, ప్రతి దిశ, ప్రతి మూల ఒక నిర్దిష్ట శక్తితో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా తులసి మొక్క , శంఖం. వాస్తులో ఈ రెండింటికీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటిని సరైన స్థలంలో ఉంచితే.. అవి ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగించి మానసిక ప్రశాంతత , సానుకూలతను తెస్తాయి. మనసుకు శాంతి, జీవితంలో స్థిరత్వం రావాలంటే వాటిని ఇంట్లో ఎక్కడ, ఎలా ఉంచాలో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఈశాన్య దిక్కులో లేదా తూర్పు దిశలో నాటడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
తులసి మొక్క సానుకూల శక్తికి కేంద్రం, పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది.
ఇది గాలిని శుద్ధి చేయడమే కాదు దాని దగ్గర కూర్చోవడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది.
ప్రతిరోజు ఉదయం తులసికి నీళ్ళు అర్పించి, దీపం వెలిగించడం వల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది.
అయితే ఇంటి లోపల, బాత్రూమ్ దగ్గర లేదా దక్షిణ దిశలో తులసి మొక్కను నాటవద్దు. ఎందుకంటే ఇది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది.
శంఖం: మనస్సుని శుద్ధి చేసి ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది.
వాస్తులో శంఖ ధ్వని శక్తికి మూలంగా పరిగణిస్తారు. శంఖాన్ని ఊదినప్పుడు.. దాని నుంచి వెలువడిన శబ్దం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
పూజ గదిలో ఈశాన్య దిశలో శంఖం ఉంచడం శుభప్రదం.
రోజువారీ పూజకు ముందు శంఖాన్ని ఊదడం వల్ల మనస్సు ఏకాగ్రత చెందుతుంది. వాతావరణం శుద్ధి అవుతుంది.
తెల్ల శంఖం (దక్షిణావర్తి శంఖం) ముఖ్యంగా మానసిక ప్రశాంతత , ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.
అయితే బాత్రూంలో లేదా వంటగదిలో ఎప్పుడూ శంఖాన్ని ఉంచవద్దు. ఇది స్వచ్ఛతకు చిహ్నం. కనుక పూజా స్థలంలో మాత్రమే ఉంచాలి.
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మానసిక ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం అయినందున ఈ చిన్న వాస్తు చర్యలు ఫలవంతం అవుతాయి.
తులసి మొక్కను పెంచడం, పూజ సమయంలో శంఖం ఊదడం, సరైన దిశలో ధ్యానం లేదా పూజ చేయడం ఇవన్నీ కలిసి జీవితంలో శాంతి, దృష్టి, సానుకూలతను తెస్తాయి. ఎవరైనా మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి కోసం కూడా చూస్తున్నట్లయితే.. ఇంటి వాస్తులో ఈ రెండు చిన్న ప్రభావవంతమైన చర్యలను అనుసరించండి. తులసి మొక్క, శంఖం కేవలం ఆధ్యాత్మిక చిహ్నాలు మాత్రమే కాదు.. ఇవి ఇల్లు మనస్సు రెండింటినీ సమతుల్యంగా ఉంచుకోవడానికి శక్తివంతమైన సాధనాలు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








