అయోధ్య రాంలాలా ఆలయంలోకి ముసుగుతో వచ్చిన మహిళ.. ఆరా తీయగా..!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాల్లో భద్రతా కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం వద్ద భద్రత మరింత కఠినతరం చేశారు. అయితే, అయోధ్యలో శుక్రవారం(మే 2) అనుమానాస్పదంగా ఉన్న ఒక ముస్లిం మహిళను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ఇరిమ్ అనే మహిళ రామ్ లల్లాను చూడటానికి అయోధ్యకు వచ్చింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాల్లో భద్రతా కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం వద్ద భద్రత మరింత కఠినతరం చేశారు. అయితే, అయోధ్యలో శుక్రవారం(మే 2) అనుమానాస్పదంగా ఉన్న ఒక ముస్లిం మహిళను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ఇరిమ్ అనే మహిళ రామ్ లల్లాను చూడటానికి అయోధ్యకు వచ్చింది.
అయోధ్య పోలీసులు రామమందిర ప్రాంగణంలో అనుమానాస్పద ముస్లిం మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె రాంలాలా దర్శనం తర్వాత ప్రాంగణం నుండి బయటకు వెళుతుండగా, భద్రతా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జిట్ గేట్ వద్ద భద్రతా సిబ్బంది ప్రశ్నించినప్పుడు ఆ మహిళ దురుసుగా ప్రవర్తించింది. దీంతో ఏదో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కనిపించింది. దీంతో ఇది గమనించిన భద్రతా సిబ్బంది అనుమానం వచ్చింది. వెంటనే సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇరిమ్ అనే ఈ మహిళ శుక్రవారం మధ్యాహ్నం ఇతర భక్తులతో కలిసి రాంలాలాను సందర్శించడానికి వచ్చింది. ఆమె దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా, నిష్క్రమణ మార్గంలో ఉన్న భద్రతా సిబ్బంది ఆమె ప్రవర్తనలో ఏదో వింతను గమనించారు. తల, ముఖం నీలిరంగు వస్త్రంతో కప్పుకున్న ఈ మహిళ కదలికలు సాధారణంగా అనిపించలేదు. భద్రతా సిబ్బంది ఆమెను ప్రశ్నించినప్పుడు, ఆమె అసౌకర్యానికి గురై భద్రతా సిబ్బందితో వాగ్వివాదానికి దిగింది. ఈ విషయం అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే, అధికారులకు సమాచారం అందించారు. సదరు మహిళను రామ జన్మభూమి పోలీస్ స్టేషన్కు తరరలించారు. అక్కడ పోలీసులు, నిఘా సంస్థలు ఆమెను విచారించడం ప్రారంభించాయి. విచారణ సమయంలో, స్పష్టమైన సమాధానాలు ఇవ్వడానికి బదులుగా, ఆ మహిళ అస్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో అనుమానం మరింత బలపడింది. పోలీసులు ఆమె విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఈ మొత్తం సంఘటనపై, రామ జన్మభూమి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు శుక్లా ఒక ప్రకటన చేస్తూ, ఏ మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకురాలేదని, విచారణ ఆవరణలోనే జరిగే అవకాశం ఉందని అన్నారు. అదే సమయంలో ఆ మహిళ పేరు, చిరునామాను ధృవీకరిస్తున్నట్లు ఏరియా ఆఫీసర్ అయోధ్య అశుతోష్ తివారీ ధృవీకరించారు. ఇప్పటివరకు ఎటువంటి అభ్యంతరకరమైన వస్తువు లేదా కార్యాచరణ గుర్తించలేదు, కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం, పోలీసులు, నిఘా సంస్థలు ఆ మహిళ నిజంగా భక్తురాలా లేదా ఏదైనా కుట్రలో భాగమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. SOURCE:
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




