AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెల 8, 9 తేదీల్లో పలు ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకంటే

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈనెల 9వ తేదీన పలు ఆర్జిత సేవలను టీటీడీ చేసింది. ఈ నెల శ్రీవారికి ఈ పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్న నేపధ్యంలో కల్యాణోత్సవం, ఉంజల్‌ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేసింది. అంతేకాదు తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్ప యాగానికి అంకురార్పణ ముందు రోజు అంటే ఈ నెల 8 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 8వ తేదీ సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకార సేవను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెల 8, 9 తేదీల్లో పలు ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకంటే
Pushpa Yagam
Surya Kala
|

Updated on: Nov 06, 2024 | 1:35 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈనెల 9వ తేదీన పలు ఆర్జిత సేవలను టీటీడీ చేసింది. ఈ నెల శ్రీవారికి ఈ పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్న నేపధ్యంలో కల్యాణోత్సవం, ఉంజల్‌ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేసింది. అంతేకాదు తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పయాగానికి అంకురార్పణ ముందు రోజు అంటే ఈ నెల 8 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 8వ తేదీ సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకార సేవను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.

కలియుగ దైవంగా పూజలను అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరతారు. ఈ నెల 9వ తేదీన కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహించనున్నారు. ఈ పుష్పయాగాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పుష్పయాగానికి అంకురార్పణ, పుష్పయాగం సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ పుష్పయాగం సందర్భంగా స్వామివారికి రెండో అర్చన, రెండో గంట, నైవేద్యాలు సమర్పించనున్నారు.

పుష్ప యాగంలో భాగంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం చేయనున్నారు. తర్వాత వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కార్తీక మాసం, శనివారం నేపధ్యంలో స్వామివారికి జరిగే పుష్పయాగంలో పాల్గొనడానికి, శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?