AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: రోజు రోజుకీ పెరుగుతోన్న శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు.. కోనేటిరాయుడికి బంగారు శంఖు, చక్రాలు భూరి విరాళం..

కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు. భక్తులు భూరి సమర్పించే విరాళాలతో శ్రీవారి ఆస్తులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరోవైవు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదు అవుతోంది.

Tirumala: రోజు రోజుకీ పెరుగుతోన్న శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు.. కోనేటిరాయుడికి బంగారు శంఖు, చక్రాలు భూరి విరాళం..
Tirumala Hundi Collection
Raju M P R
| Edited By: |

Updated on: Jul 29, 2025 | 11:12 AM

Share

తిరుమల వెంకన్నకు ఖరీదైన కానుకలు అందుతున్నాయి. హుండీ ఆదాయం తో పాటు రోజూ వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా ఉంటున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారు, వేలాది కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్న శ్రీవారికి మరిన్ని ఆభరణాలు, ఆస్తులు సొంతమవుతున్నాయి.

ఆపదమొక్కుల వాడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఆదాయము పెరుగుతోంది. హుండీలో సమర్పించే కానుకలు, విరాళాలు వెంకన్నకు కొండంత ఆస్తిగా మార్చుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి మొక్కులు చెల్లించే భక్తులు సమర్పించే కానుకలు ఇప్పుడు వెలకట్టలేనివిగా ఉంటున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడు దాకా ముడుపులు కట్టి వెంకన్న హుండీలో సమర్పిస్తున్న కానుకలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి.

ఇందులో భాగంగానే ఈ రోజు శ్రీవారికి రూ 2.4 కోట్ల విలువ గల బంగారు శంఖు చక్రాల విరాళం అందింది. సుమారు రూ.2.4 కోట్ల విలువ గల బంగారు శంఖు చక్రాలను చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ సమర్పించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖు చక్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖు చక్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరోవైవు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదు అవుతోంది. సోమవారం శ్రీవారిని దర్శించుకున్న 77,044 మంది భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి ఒక రోజు హుండీ ఆదాయం రూ 5.44 కోట్లకు చేరింది. ఈ  నెలలో తొలిసారి గా ఒక రోజుకి రూ 5.44 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఇప్పటి దాకా ఈ ఏడాదిలో నాలుగుసార్లు ఒక రోజులో రూ. 5 కోట్లకు పైగా హుండీ కానుకల ద్వారా ఆదాయం టీటీడీకి లభించింది. ఏప్రిల్ 1, మే 26, జూన్ 30, జూలై 28న ఈ నాలుగు రోజుల్లో రూ. 5 కోట్లు దాటడంతో వెంకన్న హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్