Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి ఆలయంలో ఆగష్టు 8 నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

పవిత్రోఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు.

Tirumala: శ్రీవారి ఆలయంలో ఆగష్టు 8 నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు
Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Jul 22, 2022 | 10:34 AM

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. స్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 8 నుంచి 10వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు (Pavithrotsavams) జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) పలు ఆర్జిత సేవలను ఆ మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ ఉత్సవాలు ఆగష్టు 7న అంకురార్పణంతో  ప్రారంభంకానున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి.. తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. ఇటువంటి దోషాల వలన ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఏటా ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. మళ్ళీ 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

పవిత్రోఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగ‌స్టు 8న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 9న పవిత్ర సమర్పణ, ఆగస్టు 10న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

ఆర్జితసేవలు రద్దు

ఇవి కూడా చదవండి

ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 7న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 9న అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌తోపాటు ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి. ఈ విషయాన్నీ భక్తులు దృష్టిలో పెట్టుకోవాలని టీటీడీ కోరింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..