
వేద క్యాలెండర్ ప్రకారం ఈ రోజు భాద్రప్రద మాసం అమావాస్య తిథి. ఈ రోజుని మహాలయ అమావస్యగా జరుపుకుంటారు. ఈ రోజు పూర్వీకులకు తర్పణం (నైవేద్యం), శ్రార్ధ కర్మలను, పిండ ప్రదానం వంటి కార్యక్రమాలను చేస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం అమావాస్య రోజున ఈ ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకులు సంతోషపడతారు. పితృ దోష సమస్య తొలగుతుంది. ఈ రోజున మరో విశిష్టత కూడా ఉంది.
ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం సర్వ పితృ అమావాస్య నాడు సంభవిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో పూజలు చేయడం, ఆహారం తినడం నిషేధించబడింది. గ్రహణం సమయంలో నియమాలను పాటించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఈ రోజున సూర్యగ్రహణం సమయంలో చేయవలసినవి, చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాం..
భారతదేశంలో సూర్య గ్రహణం 2025 తేదీ , సమయం ప్రకారం.. సూర్యగ్రహణం ఈ రోజు ( సెప్టెంబర్ 21) రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై తెల్లవారు జామున 3:23 గంటలకు ముగుస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. రాత్రి సమయంలో ఏర్పడే గ్రహణం కనుక మన దేశంలో గ్రహణం కనిపించదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు