AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Festival: మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు పట్టంగట్టిన భారతీయులు.. రాఖీ సందర్భంగా 17 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా

రాఖీ పండగ వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచే మార్కెట్ లో సందడి మొదలవుతుంది. తోబుట్టువులు ఆనందంగా జరుపుకునే పండగ. ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 9న జరుపుకోనున్నారు. ఇప్పటికే సోదరీమణులు రాఖీ కట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఏడాది రాఖీ పండగ కేవలం సాంప్రదాయ పండుగగా మాత్రమే కాదు.. పెద్ద వ్యాపారాన్ని జరిపిన పండగగా నిలిచిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది.

Rakhi Festival: మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు పట్టంగట్టిన భారతీయులు.. రాఖీ సందర్భంగా 17 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా
Rakshi Festival 2025
Surya Kala
|

Updated on: Aug 08, 2025 | 12:51 PM

Share

సోదరులు , సోదరీమణులు ప్రేమతో జరుపుకునే అతిపెద్ద పండుగ రాఖీకి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మార్కెట్లలో షాపింగ్ చేయడానికి జనం భారీగా తరలివస్తున్నారు. మన దేశంలో వ్యాపారుల సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఈ పండుగకు సంబంధించి ఒక అంచనా వేసింది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా రాఖీ పండగ సందర్భంగా జరిగిన వ్యాపారం దాదాపు రూ.17,000 కోట్లు ఉంటుందని అంచనా వేసింది.

దీనితో పాటు స్వీట్లు, పండ్లు, బహుమతుల కోసం దాదాపు రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని అంచనా. ఈసారి మార్కెట్లో లభించే రాఖీలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. రాఖీలలో కూడా అనేక కొత్త డిజైన్లు, థీమ్‌లు కనిపిస్తున్నాయి.

మార్కెట్లలో కనిపించే స్వావలంబన

ఇవి కూడా చదవండి

ప్రత్యేకత ఏమిటంటే ఈసారి చైనాలో తయారు చేసిన రాఖీ లేదా పండుగ వస్తువులు మార్కెట్లో అస్సలు అందుబాటులో లేవు. ఈ సంవత్సరం రాఖీ పండుగ అన్నదమ్ముల, అక్కాచెల్లెల ప్రేమకు మాత్రమే కాదు, దేశభక్తి, స్వావలంబన భారతదేశం స్ఫూర్తిని కూడా కలిగి ఉంది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా దేశ సైన్యం తన ధైర్యాన్ని ప్రదర్శించింది. క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఆగస్టు 9న జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండుగ కూడా అదే రోజున జరుపుకోనున్నారు. అందువల్ల ఈసారి రాఖీ పట్ల మార్కెట్లలో భిన్నమైన ఉత్సాహం, దేశభక్తి భావన కనిపిస్తుంది.

ఈసారి రాఖీ దేశభక్తికి, సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా ఉంటుందని చాందినీ చౌక్ ఎంపీ, అఖిల భారత వర్తకుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ముఖ్యంగా సైనికులకు అంకితం చేసిన రాఖీలకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ప్రతి నగరంలో సైనికులకు రాఖీ కట్టి వారిని సత్కరిస్తున్నారు.

రాఖీలో కొత్త డిజైన్లు, థీమ్‌లు హిట్

ఈసారి మార్కెట్లో అనేక కొత్త , ప్రత్యేకమైన డిజైన్ల రాఖీలు కనిపిస్తున్నాయి. సాంప్రదాయ రాఖీలతో పాటు, వోకల్ ఫర్ లోకల్, డిజిటల్ రాఖీ, మోడీ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీ, జై హింద్ రాఖీ, వందేమాతరం రాఖీ వంటి అనేక థీమ్ ఆధారిత రాఖీలు బాగా అమ్ముడవుతున్నాయి. దీనితో పాటు పర్యావరణం పట్ల అవగాహన కారణంగా పర్యావరణ అనుకూల రాఖీల పట్ల క్రేజ్ కూడా పెరిగింది. నేల, విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తి వంటి సహజ వస్తువులతో తయారు చేసిన రాఖీలను ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు.

విభిన్న సంస్కృతులు, కళలకు సంబంధించిన రాఖీలు

ఈసారి దేశంలోని వివిధ సంస్కృతులు,యు కళలు కూడా రాఖీలలో చోటు సంపాదించాయి. ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్ నుంచి కోసా రాఖీ, కోల్‌కతా నుంచి జనపనార రాఖీ, ముంబై నుంచి సిల్క్ రాఖీ, నాగ్‌పూర్ నుంచి ఖాదీ రాఖీ, జైపూర్ నుంచి సంగనేరి రాఖీ, పూణే నుంచి సీడ్ రాఖీ, జార్ఖండ్ నుంచి వెదురు రాఖీ, అస్సాం నుంచి టీ లీఫ్ రాఖీ, బీహార్ నుంచి మధుబని రాఖీలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

ఈ రాఖీలు అందంగా కనిపించడమే కాదు స్థానిక మహిళా వ్యవస్థాపకులు, స్వయం సహాయక బృందాలు, చేతివృత్తులవారికి కూడా సహాయపడతాయని ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇది మహిళా సాధికారతకు, స్థానిక పరిశ్రమను ప్రోత్సహించడానికి మంచి మార్గంగా మారుతోందని చెప్పారు. ఇప్పుడు భారతీయ వినియోగదారులు గర్వంగా, ఆత్మగౌరవంతో పండుగలను జరుపుకోవడం ప్రారంభించారు. దేశ ప్రజలు మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు. నా దేశం ఇక్కడ తయారీ అయ్యే వస్తువులనే ఉపయోగించాలంటే భావన ప్రతి ఇంటికి చేరుకుంటోందని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us