AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premanand Maharaj: స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా వైరల్!

Premanand Maharaj on Friendship: మీరు ఎంతో నమ్మిన ప్రాణ స్నేహితుడు శత్రువుగా మారితే ఎలా స్పందించాలి? ప్రతీకారం తీర్చుకోవాలా లేదా మౌనంగా ముందుకు సాగాలా? ప్రేమానంద మహారాజ్ చెప్పిన కర్మ, మౌనం, క్షమ, మనశ్శాంతిపై విలువైన జీవిత పాఠాలను తెలుసుకోండి.

Premanand Maharaj: స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా వైరల్!
Premanand Maharaj On Friendship
Rajashekher G
|

Updated on: Aug 05, 2026 | 4:27 PM

Share

Premanand Maharaj Telugu: జీవితంలో ఎన్నో రకాల మనుషులను కలుస్తుంటాం. వారిలో కొందరు సాధారణ పరిచయస్తులుగా మిగిలిపోతే, మరికొందరు మనకు అత్యంత ఆత్మీయులుగా, ప్రాణ స్నేహితులుగా మారతారు. అయితే, మనం పూర్తిగా నమ్మిన అదే స్నేహితుడు ఒకరోజు ద్రోహం చేసి, మన వెన్నుపోటు పొడిస్తే? అలాంటి బాధాకరమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? మనశ్శాంతిని కోల్పోకుండా ఎలా ముందుకు సాగాలి? ఈ ప్రశ్నలకు బృందావనానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ ప్రేమానంద మహారాజ్ ఇచ్చిన సూచనలు ఎంతో ఆచరణీయంగా ఉంటాయి.

ప్రతీకారం కాదు.. దూరం కావడమే ఉత్తమ మార్గం

తన ఆధ్యాత్మిక ప్రసంగాల్లో జీవితంలోని క్లిష్టమైన సమస్యలకు సరళమైన పరిష్కారాలను సూచించే ప్రేమానంద మహారాజ్, ఇటీవల ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “ఎవరైనా మీకు శత్రువుగా మారారని, మీరు కూడా వారికి శత్రువుగా మారాల్సిన అవసరం లేదు. హింస, ప్రతీకారం ఎప్పుడూ శాంతిని ఇవ్వవు. అలాంటి వ్యక్తికి ప్రశాంతంగా దూరంగా ఉండటమే నిజమైన వివేకం,” అని ఆయన చెప్పారు.

కర్మపై విశ్వాసం ఉంచండి

ప్రతి మనిషి జీవితాన్ని అతని కర్మలే నిర్దేశిస్తాయని మహారాజ్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి మీకు హాని చేయాలని ప్రయత్నిస్తే, వాస్తవానికి అతడే తన కర్మను చెడగొట్టుకుంటున్నాడని చెప్పారు. “మీరు ప్రశాంతంగా ఉండండి. దేవుడిపైనా, మీ మంచి పనులపైనా విశ్వాసం ఉంచండి. ఎవరు చేసిన తప్పుకు వారు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. దానికి మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

మౌనమే గొప్ప సమాధానం

స్నేహితుడి ద్రోహం ఎదురైనప్పుడు సహజంగానే కోపం, బాధ, ప్రతీకారం వంటి భావాలు కలుగుతాయి. కానీ అలాంటి సమయంలో నోరు అదుపులో ఉంచుకోవడం, మౌనంగా ఉండటమే నిజమైన బలం అని ప్రేమానంద మహారాజ్ సూచించారు. “కోపంతో చెడు మాటలు మాట్లాడకండి. ప్రతీకారం కోసం ప్రయత్నించకండి. మీ మౌనమే ఎదుటివారికి అత్యంత శక్తివంతమైన సమాధానం అవుతుంది,” అని ఆయన అన్నారు.

ద్వేషాన్ని వదిలి జీవితంలో ముందుకు సాగండి

ప్రతీకార భావనను మనసులో ఉంచుకోవడం వల్ల నష్టపోయేది ముందుగా మనమే. ద్వేషం మనశ్శాంతిని దూరం చేస్తుంది. అందుకే అలాంటి వ్యక్తిని అతని దారిన వదిలేసి, జరిగిన అనుభవం నుంచి పాఠం నేర్చుకుని జీవితంలో ముందుకు సాగాలని మహారాజ్ సూచించారు. “మీ మనస్సును దేవుని పాదాల చెంత ఉంచండి. సర్వశక్తిమంతుడు ప్రతి విషయాన్ని గమనిస్తాడు. చివరికి న్యాయం చేసేది ఆయనే. కాబట్టి ద్వేషాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా జీవించండి,” అని ఆయన సందేశమిచ్చారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us