
శ్రావణ మాసం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఈ మాసం ఆధ్యాత్మికతకు నెలవు. ఈ నెలలో శివ భక్తులు పూజలు చేసి మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు. అలాగే శివలింగానికి అనేక వస్తువులను సమర్పిస్తారు. వాటిలో ఒకటి జంట పాములు. ఈ సమయంలో వెండి పాములను శివుడికి సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో శివలింగానికి వెండి పాములను సమర్పించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
శివలింగానికి జంట పాములను ఎందుకు సమర్పిస్తారంటే
సాధారణంగా వెండి లేదా పంచలోహాలతో చేసిన జంట పాములను శివలింగానికి సమర్పిస్తారు,. దీనిని నాగ పంచమి లేదా మాస శివరాత్రి వంటి శుభ సందర్భాలలో సమర్పిస్తే చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అయితే శ్రావణ మాసంలో ఏ రోజుననైనా శివుడికి వెండి జత పాములను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
మత విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడికి వెండి జంట పాములను సమర్పించడం వల్ల కాల సర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయి. అందుకనే శ్రావణ మాసంలో శివలింగానికి వెండి పాముల జతను సమర్పిస్తే శివుని ఆశీర్వాదం పొందడానికి, ప్రతికూల శక్తిని తొలగించడానికి ఒక సులభమైన మార్గంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.