AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scorpion Temple: అందరికీ అది విషపురుగు.. కానీ వాళ్లకు మాత్రం దేవత. అందుకే గుడి కట్టారు. భక్తులో పోటెత్తారు.

నాగ పంచమి రోజున కొండపైన ఉన్న కొండమ్మాయి దేవాలయం వద్ద వేలాది మంది తేలు విగ్రహాన్ని పూజిస్తారు. ఈ రోజున భక్తులు తేళ్లతో ఆడుకోవడం కనిపిస్తుంది. కొందరు వాటిని తమ ముఖాలపై, నోటిలో (కుడి పైభాగంలో) ఉంచుకుంటారు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ఇక్కడి ప్రజలు తేలు విగ్రహాన్ని పూజించడమే కాకుండా సజీవ తేళ్లతో ఆడుకుంటారు. నాగ పంచమి సందర్భంగా భక్తులు తేలుని దర్శించుకుని పూజలు చేయడానికి ఆలయానికి పోటెత్తుతారు.

Scorpion Temple: అందరికీ అది విషపురుగు.. కానీ వాళ్లకు మాత్రం దేవత. అందుకే గుడి కట్టారు. భక్తులో పోటెత్తారు.
Scorpion Temple
Surya Kala
|

Updated on: May 23, 2024 | 7:37 PM

Share

హిందూ సనాతన ధర్మంలో ప్రకృతిని పూజిస్తారు. మొక్కలు, పక్షులు, జంతువులూ అనే తేడా లేకుండా పులి, సింహం, తేలు, పాము వంటి ప్రతి జీవిని దైవంగా భావించి పూజిస్తారు. ఇలా నాగు పాముని నాగుల పంచమి, నాగుల చవితి రోజున హిందువులు దైవంగా పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని ఐదవ రోజున నాగ పంచమిగా ఘనంగా జరుపుకుంటారు. పుట్టకు వెళ్లి లేదా ఆలయానికి వెళ్లి భక్తులకు, ముఖ్యంగా మహిళలు, నాగుపాము లేదా నాగ విగ్రహాలను పూజిస్తారు. పాలు పోస్తారు. అయితే కర్ణాటక లోని యాద్గిర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 15కి.మీ దూరంలో ఉన్న కండ్కూర్ గ్రామంలోని ఓ చిన్న దేవాలయంలో నాగ పంచమి రోజున ఒక భిన్నమైన వేడుకను జరుపుకుంటారు.

ఇక్కడ నాగ పంచమి రోజున కొండపైన ఉన్న కొండమ్మాయి దేవాలయం వద్ద వేలాది మంది తేలు విగ్రహాన్ని పూజిస్తారు. ఈ రోజున భక్తులు తేళ్లతో ఆడుకోవడం కనిపిస్తుంది. కొందరు వాటిని తమ ముఖాలపై, నోటిలో (కుడి పైభాగంలో) ఉంచుకుంటారు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ఇక్కడి ప్రజలు తేలు విగ్రహాన్ని పూజించడమే కాకుండా సజీవ తేళ్లతో ఆడుకుంటారు. నాగ పంచమి సందర్భంగా భక్తులు తేలుని దర్శించుకుని పూజలు చేయడానికి ఆలయానికి పోటెత్తుతారు.

రోజు పిల్లలతో సహా భక్తులు తేళ్లను ఎత్తుకుని ఆడుకోవడం చూడవచ్చు. కొందరు తేళ్ళను తమ ముఖాలపై, నోటి లోపల కూడా ఉంచుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పండగ సమయంలో తేళ్లు తమని కుట్టిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఆలయ పూజారి బాబు సిద్దాపూర్ మాట్లాడుతూ కందకూరులో దశాబ్దాలుగా తేళ్లను పూజించే ఆచారం కొనసాగుతోందని చెప్పారు. నాగ పంచమి రోజు భక్తులు, ముఖ్యంగా స్త్రీలు, నాగుపాము లేదా నాగ విగ్రహాలను పూజిస్తారు. అయితే ఇక్కడ తేళ్ళను పూజించే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు