శ్రీశైలంలో కిక్కిరిసిన భక్తులు.. కార్తీకమాసం మూడో సోమవారం కావడంతో పెరిగిన రద్దీ

| Edited By: Jyothi Gadda

Dec 04, 2023 | 7:29 AM

భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

శ్రీశైలంలో కిక్కిరిసిన భక్తులు.. కార్తీకమాసం మూడో సోమవారం కావడంతో పెరిగిన రద్దీ
Karthika Masam
Follow us on

శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీకపౌర్ణమి మూడో సోమవారం కావడంతో మల్లన్నఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం కిటకిటలాడుతోంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.

కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ లో పాలు, బిస్కెట్లు, అల్పాహారం అందిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

మరోవైపు కార్తీక మాసం సోమవారం కావటంతో ఏపీలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాళహస్తీ, కపీలతీర్దం సహా ఇతర శైవాలయాలు భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి. బనగానపల్లె (మం) లోని యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం, అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి స్నానఘట్టాలు. భక్తుల రద్దీతో రాజమండ్రిలోని న పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు పోటెత్తాయి. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం , ఉమారుద్రకోటిశ్వరాలయం, శ్రీ ఎండల మల్లిఖార్జున దేవాలయాలు‌ కిటకిటలాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..