రాధా దామోదర ఆలయంలో హోలీ వేడుకలు వెరీ వెరీ స్పెషల్.. గిరి ప్రదక్షిణ రహస్యం ఏమిటో తెలుసా

బృందావన్‌లోని రాధా దామోదర ఆలయం హోలీని జరుపుకోవడంలో తనదైన శైలిని కలిగి ఉంది. ఇక్కడ జరిగే హొలీ వేడుకలను చూసేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. రాధా దామోదర ఆలయ హోలీ మొత్తం బ్రజ్‌లో ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఇక్కడ హోలీ వేడుకలు చాలా రోజుల పాటు కొనసాగతాయి. ఠాకూర్ రాధా దామోదర్ భగవాన్ తన భక్తులతో హోలీ ఆడతారు. ఇక్కడ హొలీ వేడుకల్లో విశేషమేమిటంటే సాయంత్రం వేళ హోలీ నిర్వహిస్తారు.

రాధా దామోదర ఆలయంలో హోలీ వేడుకలు వెరీ వెరీ స్పెషల్.. గిరి ప్రదక్షిణ రహస్యం ఏమిటో తెలుసా
Holi 2024

Updated on: Mar 17, 2024 | 8:27 AM

మధురలోని బృందావనం సేవా కుంజ్ సమీపంలో రాధా దామోదర్ దేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో హోలీ జరుపుకునే సంప్రదాయం భిన్నమైంది. ఈ ఆలయంలో హోలీని రంగుల కంటే భిన్నమైన మార్గాల్లో జరుపుకుంటారు. ఇక్కడ హోలీని జరుపుకునే విధానం, దీని రంగులు ప్రత్యేకమైనవి. ఒకవైపు పూలతో హోలీ ఆడతారు, లత్మార్ హోలీని జరుపుకునే శైలి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ లడ్డూలతో జరుపుకునే హోలీ నుంచి రంగులతో జరుపుకునే హోలీ వరకు వివిధ సంప్రదాయాల ప్రకారం హోలీ జరుపుకుంటారు. హోలీ వేడుకలు బ్రజ్ లో చాలా రోజుల ముందు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఉత్సాహం, వేడుకలు వేరే స్థాయిలో కనిపిస్థాయి.

బృందావన్‌లోని రాధా దామోదర ఆలయం హోలీని జరుపుకోవడంలో తనదైన శైలిని కలిగి ఉంది. ఇక్కడ జరిగే హొలీ వేడుకలను చూసేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. రాధా దామోదర ఆలయ హోలీ మొత్తం బ్రజ్‌లో ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఇక్కడ హోలీ వేడుకలు చాలా రోజుల పాటు కొనసాగతాయి. ఠాకూర్ రాధా దామోదర్ భగవాన్ తన భక్తులతో హోలీ ఆడతారు. ఇక్కడ హొలీ వేడుకల్లో విశేషమేమిటంటే సాయంత్రం వేళ హోలీ నిర్వహిస్తారు.

గోవర్ధనునికి ప్రదక్షిణ చేసినంత సమానమైన ఫలితాలు

ఠాకూర్ రాధా దామోదర్ ఆలయంలో రంగులు, గులాల్ విస్తృతంగా ఉపయోగించబడతాయి. ఇక్కడ రంగుల వర్షం కురుస్తుంది. పురాణాల ప్రకారం రాధా దామోదర ఆలయం సుమారు 500 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో నాలుగు సార్లు గిరిరాజ శిల ప్రదక్షిణం చేయడం వల్ల గోవర్ధన పర్వతాన్ని  ప్రదక్షిణం చేసినంత ఫలితం లభిస్తుందని మత విశ్వాసం. ఆలయంలోని శ్రీ కృష్ణుని విగ్రహానికి ఎడమవైపున రాధా దేవి విగ్రహం ప్రతిష్టించి ఉంది.

ఇవి కూడా చదవండి

ఆలయంలో చాలా విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి

ఈ ఆలయంలో రాధా దామోదర దేవుడి ఎడమ వైపున రాధా దేవి కుడి వైపున లలితా సఖి, గీత గోవింద్ సృష్టికర్త అయిన జయదేవ్ గోస్వామి విగ్రహాలు ఉన్నాయి. రాధామాధవుడు, భూగర్భ గోస్వామి జీవిత నిధి రాధా చైల్ చిన్న ప్రభు ఉన్నారు. భగవంతుడు జగన్నాథుడు, శ్రీ కృష్ణుడు గోస్వామికి ఇచ్చిన శిల దర్శనాన్ని కూడా భక్తులు పొందుతారు. బృందావన్‌లో ఉన్న విగ్రహాలు ఇతర దేవాలయంలో లేవు. అందువల్ల  వైష్ణవ శాఖలో, రాధాదామోదర ఆలయ దర్శనం గొప్ప సాధనగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి ఏడు ప్రదక్షిణలు చేయడం ద్వారా కన్నయ్య దర్శన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us