AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల తర్వాత నేటి నుంచి ఆర్జిత సేవల క‌రంట్ బుకింగ్, అంగ‌ప్రద‌క్షిణం టోకెన్లు జారీ

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. గత రెండేళ్లుగా కరోనా వైరస్(Corona Virus) వలన శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించని టీటీడీ (TTD).. మళ్ళీ ఆర్జిత సేవ(Arjitha Sevas)లను భక్తులకు అందుబాటులోకి..

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల తర్వాత నేటి నుంచి ఆర్జిత సేవల క‌రంట్ బుకింగ్, అంగ‌ప్రద‌క్షిణం టోకెన్లు జారీ
Tirumala Tirupati
Surya Kala
|

Updated on: Mar 31, 2022 | 11:30 AM

Share

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. గత రెండేళ్లుగా కరోనా వైరస్(Corona Virus) వలన శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించని టీటీడీ (TTD).. మళ్ళీ ఆర్జిత సేవ(Arjitha Sevas)లను భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానున్నది. ఇందులో భాగంగా ఈరోజు తిరుమలలోని సీఆర్వో జనరల్‌ కౌంటర్‌ వద్ద ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్‌ ద్వారా కరెంట్‌ బుకింగ్‌లో భక్తులకు టీటీడీ అందించనుంది.

ఆర్జిత సేవల కోసం టికెట్లను పొందాలనుకునే భక్తులు ముందుగా సీఆర్వో జనరల్‌ కౌంటర్‌ వద్ద నమోదు చేసుకోవాలని టీటీడీ అధికారులు చెప్పారు. ఇందుకు భక్తులు తమ ఆధార్‌కార్డు, గుర్తింపు కార్డుతో సహా కౌంటర్ వద్ద నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఆర్జిత సేవా టికెట్ల నమోదు కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండనుంది.

అనంతరం ఫస్ట్ లక్కీ డిప్‌ను సాయంత్రం 6 గంటలకు తీస్తారు. అప్పుడు సేవా టికెట్లు వచ్చిన వారి వివరాలను ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు.  అర్జిత సేవా టికెట్లను పొందిన భక్తుడు ఆర్జితం కార్యాలయానికి రాత్రి 8గంటల లోపు చేరుకుని టికెట్లను పొందవచ్చు. అలా ఎవ‌రైనా తమ టికెట్లను తీసుకొని పక్షంలో వాటిని తిరిగి రాత్రి 8.30 గంటలకు రెండోసారి నిర్వహించే లక్కీడిప్ కోసం కరంట్ బుకింగ్‌కు మళ్లిస్తారు. ల‌క్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు తమ టికెట్ల వివరాలను  రాత్రి 11 గంట‌ల‌లోపు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్‌ ద్వారా స‌మాచారం తెలియ‌జేస్తారు. టికెట్లు పొంద‌ని వారికి కూడా ఇదే విషయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలియ‌జేస్తారు.

కొత్తగా పెళ్లయిన జంటలకు నిర్ణీత కోటా ప్రకారం వివాహ కార్డు, లగ్న పత్రిక, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు స‌మ‌ర్పిస్తే కల్యాణోత్సవం టికెట్ల కేటాయింపు జ‌రుగుతుంది. వివాహం జ‌రిగి 7 రోజులు మించ‌కుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న టికెట్లు కేటాయిస్తారు.

నేటి నుంచి అందుబాటులోకి అంగప్రదక్షిణ టికెట్లు: శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు టీటీడీ టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి తీసుకుని వచ్చింది. అంగప్రదక్షిణ టికెట్లనూ గురువారం నుంచి భక్తులకు అందించనున్నారు. స్థానిక పీఏసీ-1 వద్ద రోజుకు 750 టికెట్ల చొప్పున 2 కౌంటర్ల ద్వారా జారీ ఈ టికెట్లను భక్తులకు అందజేయనున్నారు. ఈ టికెట్లు పొందినవారు శుక్రవారం మినహా అంగప్రదక్షిణతో పాటు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే శుక్రవారం రోజున మాత్రం ఆలయంలో ఒక్క అంగప్రదక్షిణకు మాత్రమే అనుమతిస్తారు. దర్శనం ఉండదు.

Also Read: Uttarakhand: ఆస్కార్ విజేత విల్ స్మిత్‌కు హరిద్వార్‌తో ప్రత్యేక అనుబంధం.. శివయ్యకు పూజలు

Bhishma Niti: భార్య, భర్తలు ఓకే ప్లేట్‌లో భోజనం చేయవద్దు అంటున్న భీష్మ.. వెంట్రుక వచ్చిన అన్నం తింటే కలిగే ఫలితం ఏమిటో తెలుసా..