Garuda puranam: గరుడ పురాణం ప్రకారం ఈ 5 తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట.. అవి ఏమిటంటే..

|

Feb 09, 2024 | 7:22 PM

ఈ పురాణానికి అధిదేవత శ్రీ మహావిష్ణువుగా పరిగణించబడుతున్నాడు. ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గరుడ పురాణంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక సమాచారం ఇవ్వబడింది. అంతేకాకుండా ఒక వ్యక్తి తన జీవితానికి బాధ్యత వహిస్తాడని గరుడ పురాణంలో కూడా వివరించబడింది. ఈ పురాణంలో మనిషి  జీవించడానికి కొన్ని నియమాలు కూడా ప్రస్తావించబడ్డాయి. మన జీవితంలో మనం ఎప్పుడూ చేయకూడని విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఈ రోజు గరుడ పురాణంలో పేర్కొన్న విషయాలు ఏంటో తెలుసుకుందాం.. 

Garuda puranam: గరుడ పురాణం ప్రకారం ఈ 5 తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట.. అవి ఏమిటంటే..
Garuda Puranam
Follow us on

సనాతన హిందూ ధర్మంలో మానవ జీవన విధానంపై కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా హిందూ మత గ్రంథాలలో అనేక జీవన విధానాలు పేర్కొన్నారు. వీటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవచ్చు. గరుడ పురాణం హిందూ పురాణాల్లోని 18 పురాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పురాణానికి అధిదేవత శ్రీ మహావిష్ణువుగా పరిగణించబడుతున్నాడు. ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గరుడ పురాణంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక సమాచారం ఇవ్వబడింది. అంతేకాకుండా ఒక వ్యక్తి తన జీవితానికి బాధ్యత వహిస్తాడని గరుడ పురాణంలో కూడా వివరించబడింది. ఈ పురాణంలో మనిషి  జీవించడానికి కొన్ని నియమాలు కూడా ప్రస్తావించబడ్డాయి. మన జీవితంలో మనం ఎప్పుడూ చేయకూడని విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఈ రోజు గరుడ పురాణంలో పేర్కొన్న విషయాలు ఏంటో తెలుసుకుందాం..

గరుడ పురాణం ప్రకారం ఏమి చేయకూడదంటే

శ్మశాన వాటిక పొగకు దూరంగా ఉండండి: గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తిని శ్మశాన వాటికలో దహనం చేస్తున్న సమయంలో ఎవరైనా సరే అప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మృతదేహం కాలుతున్న సమయంలో పొగతో పాటు విషపూరితమైన మూలకాలు వాతావరణంలోకి వ్యాపిస్తాయి. ఈ విషపూరిత మూలకాల్లో అనేక రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి సమీపంలో ఉన్న వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

తెల్లవారుజాము అయినా నిద్రపోవడం: గరుడ పురాణం ప్రకారం.. ఎవరైనా దీర్ఘాయుష్షు పొందాలనుకుంటే  ఉదయం ఆలస్యంగా మేల్కొనే అలవాటును మార్చుకోండి. పురాణ  గ్రంధాలలో బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం మంచిదని పేర్కొన్నారు. ఉదయపు గాలి కూడా స్వచ్ఛమైనది. ఇది మానవులను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

రాత్రిపూట పెరుగు తినడం: గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట పెరుగు లేదా పెరుగుతో చేసిన వస్తువులను ఎప్పుడూ తినకూడదు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఇది మనిషి జీవితకాలంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు రాత్రి మిగిలిపోయిన మాంసాహారాన్ని తినకూడదు.

నిద్రించడానికి సరైన మార్గం: దక్షిణం లేదా పడమర దిశ వంటి తప్పు దిశలో తలపెట్టి నిద్రించడం వలన  ఆయుష్షును తగ్గిస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది. అంతేకాదు గదిలోకి ప్రవేశించే సమయంలో ఆ గదిలో కొద్దిగా నైనా కాంతి ఉండాలి. అయితే మంచం మీద పడుకున్న తర్వాత గది చీకటిగా ఉండాలి. విరిగిన మంచంపై పడుకోవడం కూడా నిషేధించబడింది అన్న విషయం గుర్తుంచుకోండి.

ఈ మార్గాన్ని అవలంబించవద్దు: గరుడ పురాణం ప్రకారం తప్పుడు చర్యల వలన జరిగే పరిణామాల గురించి  తెలిసినప్పటికీ.. తప్పుడు మార్గంలో నడిచే వ్యక్తి పాపాలకు పాల్పడతాడు. అదే సమయంలో స్త్రీలు, పిల్లలు,  మానవత్వం  గురించి తప్పుడు ఆలోచనలు ఉన్నవారు.. తమ ఆయుష్షును తామే తగ్గించుకునే బాధ్యత తీసుకున్నట్లే అని పేర్కొన్నది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు