Rajeshwar Mandir: ఆగ్రాలో రోజుకి మూడు రంగులు మారే శివలింగం.. 850 ఏళ్ల చరిత్ర గల శివాలయం విశిష్టత గురించి తెలుసుకోండి..

ఆగ్రా నగరంలో రాజేశ్వరాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజ్ మహల్‌కు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో నాలుగు దిక్కులలో వివిధ శివాలయాలు ఉన్నాయి. వీటిని ఆగ్రాలోని చార్ ధామ్ అంటారు.

Rajeshwar Mandir: ఆగ్రాలో రోజుకి మూడు రంగులు మారే శివలింగం.. 850 ఏళ్ల చరిత్ర గల శివాలయం విశిష్టత గురించి తెలుసుకోండి..
Rajeshwar Mandir, Agra
Follow us

|

Updated on: Jul 12, 2022 | 8:28 AM

Rajeshwar Mandir: పాయల్ రోహత్గి , సంగ్రామ్ సింగ్ లు  వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఆగ్రాలోని జేపీ ప్యాలెస్‌లో సాంప్రదాయ రీతిలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు ఇద్దరూ ఆగ్రాలోని ప్రముఖ రాజేశ్వర్ ఆలయానికి వెళ్లి మహాదేవుని ఆశీస్సులు పొందారు. ఆ తర్వాతే వీరి వివాహ తంతు మొదలైంది. ఈ దేవాలయం సుమారు 850 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఆగ్రాలోని శంసాబాద్ రోడ్డులోని రాజ్‌చుంగి సమీపంలో ఉన్న రాజేశ్వర ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఈరోజు తెలుసుకుందాం..

ఆగ్రా నగరంలో రాజేశ్వరాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజ్ మహల్‌కు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో నాలుగు దిక్కులలో వివిధ శివాలయాలు ఉన్నాయి. వీటిని ఆగ్రాలోని చార్ ధామ్ అంటారు. ఈ ఆలయాలలో ఉన్న మహాదేవుడు తాజనగరిని నాలుగు దిక్కులనూ రక్షిస్తాడని నమ్ముతారు. ఈ నాలుగు ఆలయాలలో రాజేశ్వరాలయం కూడా ఒకటి. ఈ నాలుగు ఆలయాలకు భిన్నమైన లక్షణాలు, నమ్మకాలు ఉన్నాయి. ఈ దేవాలయాలలో హృదయపూర్వకంగా ఏ కోరికనైనా శివయ్యకు వెల్లడిస్తే.. అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. తమ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని కోరుతూ.. పాయల్ , సంగ్రామ్ లు పెళ్లి వేడుక్కి ముందు రాజేశ్వర ఆలయానికి వచ్చారు.

రాజేశ్వర ఆలయాన్ని రాజ్‌ఖేడాకు చెందిన వడ్డీ వ్యాపారి నిర్మించారని స్థానికుల కథనం. అతను ఈ శివలింగాన్ని నర్మదా నది దగ్గర నుండి తీసుకొచ్చి రాజ్‌ఖేడాలో స్థాపించాలనుకున్నాడు. అయితే రాత్రి రాజ్‌పూర్ ఆక్ట్రాయ్ ప్రాంతంలో విశ్రాంతి కోసం బస చేశారు. అప్పుడు అతని కలలో చివుడు కనిపించి.. శివలింగాన్ని ఇక్కడే  ప్రతిష్టించమని సూచించాడు. అయితే ఆ వడ్డీ వ్యాపారి తనకు వచ్చిన  కలను నమ్మలేదు.  మరుసటి రోజు అతను ఎద్దుల బండిపై శివలింగాన్ని పెట్టి.. అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలనుకున్నాడు. ఎంత సేపు ఎద్దుల బండిని ముందుకు కదిలించాలని చూసినా.. ఆ ఎద్దుల బండి ఆ ప్రదేశం నుండి కదలలేదు. శివలింగం అక్కడ నుండి పడిపోయింది.. తనకు తానే ఆ ప్రాంతంలో  ప్రతిష్టించబడింది. అనంతరం ఆ వడ్డీవ్యాపారి.. అక్కడ నుంచి శివలింగాన్ని ఎత్తడానికి చాలా ప్రయత్నించాడు.. శివలింగాన్ని ఎత్తలేకపోయాడు.  అప్పుడాయనకి ఇది మహాదేవుని ఆజ్ఞ అని అర్థమైంది. ఆ తర్వాత శివలింగం పడిన చోటే ఆలయాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి

రాజ్‌పూర్ పన్ను ప్రాంతంలో ఉన్నందున ఈ ఆలయాన్ని రాజేశ్వర మహాదేవ అని పిలుస్తారు. ఈ శివలింగం రోజుకు మూడుసార్లు రంగు మారుతుంది. ఉదయం తెల్లగా, మధ్యాహ్నం లేత నీలం రంగులో ..  రాత్రికి గులాబీ రంగులో ఉంటుంది. శ్రావణ మాసం సోమవారం, శివరాత్రి మొదలైన పర్వదినాల్లో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..