వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ నేతల వాహనాలపై దాడి

పశ్చిమ బెంగాల్‌లో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా తృణమూల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి బీజేపీ నాయకులు ముకుల్‌ రాయ్‌, శామిక్‌ భట్టాచార్య వాహనాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో వారు వాహనాల్లో లేకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. భట్టాచార్య డమ్‌ డమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత వారం బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు […]

వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ నేతల వాహనాలపై దాడి
Follow us

| Edited By:

Updated on: May 17, 2019 | 1:48 PM

పశ్చిమ బెంగాల్‌లో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా తృణమూల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి బీజేపీ నాయకులు ముకుల్‌ రాయ్‌, శామిక్‌ భట్టాచార్య వాహనాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో వారు వాహనాల్లో లేకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు.

భట్టాచార్య డమ్‌ డమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత వారం బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కాన్వాయ్‌పై కూడా దుండగులు దాడి చేశారు. టీఎంసీ, బీజేపీ మధ్య చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో ఒక రోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.