జగన్ ప్రభుత్వానికి ఊరట: అనుకూలంగా వంశాధార ట్రిబ్యునల్ తీర్పు..!
ఏపీ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. గత కొన్నిరోజులుగా.. ఏపీ, ఒడిషా మధ్య ఉన్న శ్రీకాకుళం జిల్లా నేరేడ్ బ్యారేజీపై.. వంశాధార ట్రిబ్యునల్ కీలక తీర్పును వెల్లడించింది. కాగా.. గతంలో.. నేరేడి బ్యారేజీకి సంబంధించిన 106 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టడానికి జాయింట్ సర్వేకు వంశధార ట్రిబ్యునల్ అనుమతించిన విషయం తెలిసిందే. అలాగే.. ఆ ఆర్డర్లో మార్పులు చేయాలని ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్ను […]

ఏపీ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. గత కొన్నిరోజులుగా.. ఏపీ, ఒడిషా మధ్య ఉన్న శ్రీకాకుళం జిల్లా నేరేడ్ బ్యారేజీపై.. వంశాధార ట్రిబ్యునల్ కీలక తీర్పును వెల్లడించింది. కాగా.. గతంలో.. నేరేడి బ్యారేజీకి సంబంధించిన 106 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టడానికి జాయింట్ సర్వేకు వంశధార ట్రిబ్యునల్ అనుమతించిన విషయం తెలిసిందే. అలాగే.. ఆ ఆర్డర్లో మార్పులు చేయాలని ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్ను సిద్ధం చేయాలని ఆదేశించింది. బ్యారేజ్కు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిసెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. రెండు వారాల పాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒడిశా విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించి.. తదుపురి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది.



